Share News

Rajanna Sircilla: రాజన్న గోశాలలో మరో మూడు కోడెల మృతి

ABN , Publish Date - Jun 03 , 2025 | 05:43 AM

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం తిప్పాపూర్‌ గోశాలలో సోమవారం మరో 3 కోడెలు మృతిచెందాయి.

Rajanna Sircilla: రాజన్న గోశాలలో మరో మూడు కోడెల మృతి

సిరిసిల్ల, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం తిప్పాపూర్‌ గోశాలలో సోమవారం మరో 3 కోడెలు మృతిచెందాయి. దీంతో మృతిచెందిన కోడెల సంఖ్య 20కి చేరింది. కోడెల ఆరోగ్య పరిస్థితిపై జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్‌ రవీందర్‌రెడ్డి హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు.


ప్రస్తుతం 16 కోడెలు అనారోగ్యంతో ఉన్నాయని, వీటిలో 6 కోడెల పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఐదుగురు వైద్యులు, 12 మంది సిబ్బందితో శిబిరం ఏర్పాటు చేసి కోడెలకు చికిత్స అందిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

బేకరీలో దారుణం.. అందురూ చూస్తుండగానే..

చుండ్రు సమస్యకు సింపుల్ చిట్కాలు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 03 , 2025 | 05:43 AM