Ponnam Prabhakar: విద్యార్థులు ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలి
ABN , Publish Date - Apr 27 , 2025 | 04:51 AM
మంత్రి పొన్నం ప్రభాకర్ బేగంపేటలో జరిగిన కార్యక్రమంలో, ఇంటర్ బీసీ గురుకుల, హాస్టల్ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు. 162 మంది విద్యార్థులకు రూ. 10 వేల నగదు ప్రోత్సాహం అందించారు, తద్వారా వారికి ప్రోత్సాహాన్ని ఇచ్చి మంచి భవిష్యత్తు సాధించాలన్న ఆకాంక్షతో మార్గనిర్దేశం చేశారు

ఇంటర్ బీసీ గురుకుల, హాస్టల్ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసిన మంత్రి పొన్నం
హైదరాబాద్, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని, ఉత్తమ ప్రతిభతో గురువులు, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని సూచించారు విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులను ప్రభుత్వం కల్పిస్తోందని చెప్పారు. శనివారం బేగంపేట టూరిజం ప్లాజాలో ఇంటర్మీడియట్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన 162 మంది మహాత్మాజ్యోతిబా ఫూలే బీసీ గురుకుల, బీసీ హాస్టళ్ల విద్యార్థులను మంత్రి సన్మానించారు. ఒక్కొక్కరికి రూ.10 వేల నగదు ప్రోత్సాహాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులు భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థానానికి ఎదగాలన్న లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు.
ఇవి కూడా చదవండి
Butta Renuka: ఆస్తుల వేలం.. వైసీపీ మాజీ ఎంపీకి బిగ్ షాక్
Human Rights Demad: కాల్పులు నిలిపివేయండి.. బలగాలను వెనక్కి రప్పించండి.. పౌరహక్కుల నేతలు డిమాండ్
Read Latest Telangana News And Telugu News