Maoists: వాగుపై నక్సల్స్ భారీ వంతెన నిర్మాణం
ABN , Publish Date - Jul 29 , 2025 | 05:00 AM
అది ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా గుంజిపర్తి, కోమటిపల్లి సరిహద్దులోని దట్టమైన అటవీ ప్రాతం. ఎటు చూసినా గుట్టలు, లోయలతో ఉంటుంది.

గూగుల్ మ్యాప్స్లో బయటపడిన వారధి
చర్ల, జూలై 28 (ఆంధ్రజ్యోతి): అది ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా గుంజిపర్తి, కోమటిపల్లి సరిహద్దులోని దట్టమైన అటవీ ప్రాతం. ఎటు చూసినా గుట్టలు, లోయలతో ఉంటుంది. ఆ దండకారణ్యంలో ప్రవహిస్తున్న అతి పెద్ద చింతవాగుపై మావోయిస్టులు భారీ వంతెన కట్టినట్లు తెలుస్తోంది. 15 రోజుల క్రితం కేంద్ర బలగాలు గూగుల్ మ్యాప్స్లో ఈ వారధిని గుర్తించాయి.
సుమారు 60 మీటర్ల పొడవున కర్రలతో పటిష్ఠంగా దీన్ని నిర్మించారని తెలుస్తోంది. గత డిసెంబరులో ఈ వంతెన లేదని బలగాలు చెబుతున్నాయి. వర్షాకాలంలో రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఈ మధ్య కాలంలోనే దీన్ని నిర్మించుకున్నట్టు అంచనా వేస్తున్నాయి. ఈ వంతెన ఉన్న ప్రాంతం తెలంగాణ సరిహద్దుకు 30 కి.మీ. దూరంలో ఉంటుంది.