Share News

Medigadda Barrage: ఎన్‌డీఎస్‌ఏ నివేదికను తిరస్కరిస్తున్నాం

ABN , Publish Date - May 27 , 2025 | 04:12 AM

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యంపై జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) నివేదికను తిరస్కరిస్తున్నట్లు ఆ బ్యారేజీ నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ-పీఈఎస్‌ జాయింట్‌ వెంచర్‌ ప్రకటించింది.

Medigadda Barrage: ఎన్‌డీఎస్‌ఏ నివేదికను తిరస్కరిస్తున్నాం

  • పరీక్షలు చేయకుండానే మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యంపై అభిప్రాయానికి ఎలా వస్తారు?

  • నీటిపారుదల శాఖకు ఎల్‌అండ్‌టీ లేఖ

  • కాళేశ్వరంపై బాధ్యత అంతా కేసీఆర్‌దే!

  • నాటి ఆర్థిక మంత్రిగా నా అభిప్రాయాలతో

  • పని లేకుండానే బడ్జెట్‌ కేటాయింపులు

  • కమిషన్‌కు ఈ విషయాలే చెప్పనున్న ఈటల?

  • 6న కాళేశ్వరం కమిషన్‌ ముందు హాజరు

హైదరాబాద్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యంపై జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) నివేదికను తిరస్కరిస్తున్నట్లు ఆ బ్యారేజీ నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ-పీఈఎస్‌ జాయింట్‌ వెంచర్‌ ప్రకటించింది. మేడిగడ్డ బ్యారేజీపై ఎన్‌డీఎ్‌సఏ చేసిన పరిశీలనలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది. ఈ మేరకు నీటిపారుదల శాఖకు ఈ నెల 24న సంచలన లేఖ రాసింది. ఎన్‌డీఎ్‌సఏ నివేదికలోని ఎగ్జిక్యూటివ్‌ సమ్మరీలో పాయింట్‌-5 ప్రకారం.. మేడిగడ్డ వైఫల్యానికి కారణాలు తెలుసుకోవాలంటే తగిన పరీక్షలు జరగాలని ఉందని ఎల్‌అండ్‌టీ గుర్తు చేసింది. ఆ పరీక్షలు చేయకుండా రాఫ్ట్‌, సీకెంట్‌ పైల్స్‌ కటా్‌ఫల పరిస్థితి తెలుసుకునే అవకాశం లేకుండా పోయిందని నివేదికే చెప్పిందని తెలిపింది. కానీ, గ్రౌటింగ్‌ కారణంగా పరీక్షలు చేయలేకపోయామని నివేదికలో పలుచోట్ల ప్రస్తావించారని పేర్కొంది. క్వాలిటీ కంట్రోల్‌, నిర్మాణ వైఫల్యాలు, నిర్మాణ క్రమంలో వినియోగించే సామగ్రి పరీక్షలు చేయని విషయాన్ని తెలిపిందని గుర్తు చేసింది. పరీక్షలు చేయకుండానే వైఫల్యానికి కారణాలపై ఏ విధంగా అభిప్రాయానికి వస్తారని ప్రశ్నించింది.


నివేదికలోని పేజీ-283లో క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌(క్యూఎంపీ) పత్రాలను నిర్మాణ సంస్థ సమర్పించిందని చె బుతూనే.. క్వాలిటీ కంట్రోల్‌ ప్రమాణాలు పాటించలేదని మరోచోట పేర్కొన్నారని ఎల్‌అండ్‌టీ తప్పుబట్టింది. 2024 మార్చి 21న ఎన్‌డీఎ్‌సఏ తమకు ప్రశ్నావళిని ఇవ్వగా.. అందులోని అన్ని అంశాలకూ జవాబిచ్చామని తెలిపింది. ఇక 2016 జూలై 14న క్వాలిటీ కంట్రోల్‌ మాన్యువల్‌ను నీటిపారుదల శాఖకు సమర్పించామని, సీకెంట్‌ పైల్స్‌ను ఏ విధంగా వినియోగించాలనే విషయాన్ని వివరించామని వెల్లడించింది. నిరంతర క్వాలిటీ కంట్రోల్‌ పరీక్షలకు సంబంఽధించిన నివేదికలు ఇచ్చామని, ప్రతి మూడునెలలకు ఒకసారి నీటిపారుదల శాఖ జారీ చేసిన వినియోగదారుల సంతృప్తి నివేదికతోపాటు థర్డ్‌ పార్టీ టెస్ట్‌ మెటీరియల్‌, అంతర్గత ఆడిట్‌ నివేదికలు, ప్రతి వారం రోజులకు ఒకసారి, 28 రోజులకు ఒకసారి క్యూబ్‌ టెస్ట్‌ పరీక్షల నివేదికలు అందించామని వివరించింది. ఎన్‌డీఎ్‌సఏ నివేదిక ప్రకారం బ్యారేజీ మరమ్మతులు/పునరుద్ధరణపై ప్రణాళిక అందించాలని ఎల్‌అండ్‌టీని నీటిపారుదల శాఖ ఇదివరకే కోరగా.. ఇప్పటికే ఒకసారి లేఖ రాసింది. తాజాగా ఎన్‌డీఎ్‌సఏ నివేదికను ప్రశ్నిస్తూ.. మరో లేఖ రాసింది.


Also Read:

సైంటిస్టులు అద్భుత ఆవిష్కరణ.. 'సూపర్-విజన్' లెన్స్‌తో చీకట్లోనూ చూసేయచ్చు..

సన్నగా, బలహీనంగా ఉన్నారా? ఫిట్‌నెస్ మంత్ర ఇదే..

For More Health News and Telugu News..

Updated Date - May 27 , 2025 | 04:12 AM