Share News

CPI: ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి

ABN , Publish Date - Jun 13 , 2025 | 04:00 AM

ఆటో చార్జీలు పెంచడం, కార్మికుల సంక్షేమబోర్డు ఏర్పాటు, ఇతర సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేనిసాంబశివరావు చెప్పారు.

CPI: ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి

  • సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

హైదరాబాద్‌, జూన్‌ 12(ఆంధ్రజ్యోతి): ఆటో చార్జీలు పెంచడం, కార్మికుల సంక్షేమబోర్డు ఏర్పాటు, ఇతర సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేనిసాంబశివరావు చెప్పారు. జీహెచ్‌ఎంసీ, ఓఆర్‌ఆర్‌ పరిధిలో కొత్తగా 60 వేల ఆటోలను అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఆటో కార్మికులు సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో కూనంనేనిని సన్మానించారు.


తెలంగాణ ఆటోరిక్షా డ్రైవర్ల సంఘం ఐకాస కన్వీనర్‌ వెంకటేశం మాట్లాడు తూ ఓలా, ఉబర్‌ తదితర సంస్థల నుంచి డ్రైవర్లను రక్షించడానికి ప్రభుత్వ మే ఒక యాప్‌ రూపొందించేలా రవాణాశాఖ మంత్రితో చర్చించాలని కోరారు.

Updated Date - Jun 13 , 2025 | 04:00 AM