Bhadrachalam రామాలయంలో జ్యేష్ఠాభిషేకం ఉత్సవాలు
ABN , Publish Date - Jun 10 , 2025 | 07:32 AM
Jyestabhishekam Utsavam: భద్రాచలం కొత్తగూడెం.. భద్రాద్రి రామాలయంలో జ్యేష్ఠాభిషేకం ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు సంబంధించి ఈరోజు ఆలయ అధికారులు అంకురార్పణ చేయనున్నారు.

Bhadradri Kothagudem: భద్రాచలం (Bhadrachalam) రామాలయంలో (Sri Rama Temple) మంగళవారం నుంచి జ్యేష్ఠాభిషేకం ఉత్సవాలు (Jyestabhishekam Utsavam) జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు ఈ రోజు అంకురార్పణ జరగనుంది. ఈ సందర్భంగా బుధవారం అభిషేకం కార్యక్రమంతో రామయ్య నిత్య కళ్యాణం కార్యక్రమాన్ని ఆలయ అధికారులు నిలిపివేయనున్నారు. కాగా వేసవి సెలవులు ముగియనుండడంతో శని, ఆదివారాలు శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తడంతో ఆలయ ప్రాంగణమంతా శ్రీరామ నామస్మరణలతో మారుమోగింది. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం, ప్రత్యేక దర్శనం క్యూలైన్ భక్తులతో కిక్కిరిసిపోయాయి. ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాముల మూలమూర్తులకు ఆలయ అర్చకులు బంగారు తులసీదళాలతో అర్చన చేశారు. భక్తులు భారీగా తరలి రావడంతో ఉచిత దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.
ఇవి కూడా చదవండి:
For More AP News and Telugu News