Khairatabad Ganesh: ఈసారి 69 అడుగుల విశ్వశాంతి మహాశక్తి గణపతి
ABN , Publish Date - Jun 07 , 2025 | 03:26 AM
ఈసారి వినాయక ఉత్సవాల్లో ఖైరతాబాద్ గణపతి విశ్వశాంతి మహాశక్తి గణేషుడిగా పూజలందుకోనున్నాడు.

ఖైరతాబాద్ గణేషుడి రూపకల్పన పనులు ప్రారంభం
ఖైరతాబాద్, జూన్ 6(ఆంధ్రజ్యోతి): ఈసారి వినాయక ఉత్సవాల్లో ఖైరతాబాద్ గణపతి విశ్వశాంతి మహాశక్తి గణేషుడిగా పూజలందుకోనున్నాడు. 69 అడుగుల ఎత్తుతో నాగసర్పంపై ఐదు తలల నాగుపాము నీడన మూడు తలలు, 8 చేతులతో శాంతమూర్తిగా గణపతి దర్శనమివ్వానున్నాడు. గణేషుడికి పూరీ జగన్నాథుడు ఓ వైపు, లలితా త్రిపుర సుందరీ దేవి మరోవైపున కొలువుదీరనున్నారు. అలాగే కుడి వైపు లక్ష్మీ సమేత హయగ్రీవస్వామి, కుడి వైపు గజ్జెలమ్మ తల్లిని ఆవిష్కరిస్తున్నారు.
గణపతి విగ్రహ రూపకల్పన పనులు శుక్రవారం మొదలయ్యాయి. మండపం కోసం వాడే కర్రకు పూజలు చేసి పనులు ప్రారంభించారు. గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు, రాజ్యసభ సభ్యుడు ఎం అనిల్ కుమార్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, కార్పొరేటర్ విజయారెడ్డి కర్రపూజలో పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తహశీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వోపై దాడి.. స్వల్ప గాయాలు
బనకచర్లపై ఘాటుగా స్పందించిన మంత్రి ఉత్తమ్
For AndhraPradesh News And Telugu News