KCR: కేసీఆర్కు వైద్య పరీక్షలు!
ABN , Publish Date - Jul 11 , 2025 | 05:40 AM
బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మరోసారి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇటీవల అస్వస్థతకు గురైన కేసీఆర్ చికిత్స నిమిత్తం సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.

యశోద ఆస్పత్రిలో ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉన్న బీఆర్ఎస్ అధినేత
హైదరాబాద్ సిటీ, జూలై 10 (ఆంధ్రజ్యోతి): బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మరోసారి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇటీవల అస్వస్థతకు గురైన కేసీఆర్ చికిత్స నిమిత్తం సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. డిశ్చార్జి అనంతరం ఆయన నందినగర్లోని తన నివాసానికి వెళ్లి విశ్రాంతి తీసుకుంటున్నారు. వైద్యుల సలహా మేరకు గురువారం కేసీఆర్ మరోసారి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఉదయం 9.30 గంటలకు ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలన్నీ పూర్తయిన తర్వాత సాయంత్రం 6.30 గంటలకు కేసీఆర్ ఇంటికి వెళ్లిపోయారు.
ఈ వార్తలు కూడా చదవండి.
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్
గొంతు నొప్పిని తగ్గించే సింపుల్ చిట్కా..
ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి
Read Latest Telangana News and National News