Kadiyam Srihari: వారిని ఒకే కోణంలో చూడొద్దు
ABN , Publish Date - Apr 29 , 2025 | 03:46 AM
ఉగ్రవాదులు, మావోయిస్టులను ఒకే కోణంలో చూడకూడదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు

హనుమకొండ సిటీ, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): ఉగ్రవాదులు, మావోయిస్టులను ఒకే కోణంలో చూడవద్దని.. కేంద్రం వెంటనే ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపేయాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. సోమవారం హనుమకొండలో మీడియాతో మాట్లాడారు. ప్రశ్నించే గొంతుకలు, ప్రజా సంఘాలను బీఆర్ఎస్ పాలనలో అణచివేశారని.. ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలన్న కేసీఆర్ డిమాండ్లో నిజాయతీ లేదని కడియం శ్రీహరి విమర్శించారు.