Share News

KA Paul: యుద్ధ సామాగ్రి విక్రయాలను అమెరికా నిలిపివేయాలి

ABN , Publish Date - May 17 , 2025 | 04:46 AM

యుద్ధ సామాగ్రిని అమ్మేవారు యుద్ధాన్ని కోరుకుంటారు తప్ప శాంతిని కోరుకోరని’ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ అన్నారు.

KA Paul: యుద్ధ సామాగ్రి విక్రయాలను అమెరికా నిలిపివేయాలి

  • 24న సికింద్రాబాద్‌లో శాంతి సభ: కేఏ పాల్‌

న్యూఢిల్లీ, మే 16(ఆంధ్రజ్యోతి): ‘యుద్ధ సామాగ్రిని అమ్మేవారు యుద్ధాన్ని కోరుకుంటారు తప్ప శాంతిని కోరుకోరని’ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ అన్నారు. శుక్రవారం, తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ శాంతిని కోరుకుంటే మొదట యుద్ధ సామాగ్రిని అమ్మడాన్ని ఆపేయాలి. మన దేశ జీడీపీలోని మూడో వంతుకు సమానమైన యుద్ధ సామాగ్రిని సౌదీ, యూఏఈ, ఖతార్‌ దేశాలకు ఇటీవల ట్రంప్‌ మూడు రోజుల్లోనే అమ్మారు.


అలాంటి వారు యుద్ధాన్ని ఆపగలరా? భారత్‌, పాక్‌ యుద్ధం సీజ్‌ ఫైర్‌కు ముందు తాము జోక్యం చేసుకోబోమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ అన్నారు. ఆ తర్వాత తామే యుద్ధాన్ని ఆపామని ట్రంప్‌ అబద్ధాలు చెప్పారు. ట్రంప్‌ పరువు పోతుందని ప్రధాని మోదీ ఈ విషయంలో నిశ్శబ్దంగా ఉన్నారు. ఈ నెల 24న సికింద్రాబాద్‌ జింఖనా గ్రౌండ్స్‌లో శాంతిసభ నిర్వహిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల నుంచి ప్రజలు వస్తున్నారు’ అని కేఏ పాల్‌ ప్రకటించారు.

Updated Date - May 17 , 2025 | 04:46 AM