Hyderabad: సీనియర్ జర్నలిస్టు రామకృష్ణ కన్నుమూత
ABN , Publish Date - May 31 , 2025 | 03:59 AM
సీనియర్ జర్నలిస్టు జాగర్లమూడి రామకృష్ణ (71) కన్నుమూశారు. అనారోగ్యంతో అస్వస్థతకు గురైన ఆయన్ను ఆస్పత్రిలో చేర్చగా..

హైదరాబాద్ సిటీ/హైదరాబాద్, మే 30 (ఆంధ్రజ్యోతి): సీనియర్ జర్నలిస్టు జాగర్లమూడి రామకృష్ణ (71) కన్నుమూశారు. అనారోగ్యంతో అస్వస్థతకు గురైన ఆయన్ను ఆస్పత్రిలో చేర్చగా.. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు పరిస్థితి విషమించి మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. నలభై ఏళ్లకుపైగా పాత్రికేయ రంగంలో సేవలందించిన రామకృష్ణ.. సినీహెరాల్డ్ పత్రికలో ఉద్యోగ జీవితం ప్రారంభించారు. ఈనాడు, ఆంధ్రభూమి దిన పత్రికలతో పాటు మాటీవీ, జెమిని తదితర టెలివిజన్ చానెళ్లలోనూ పనిచేశారు. రామకృష్ణ మృతికి సీఎం రేవంత్రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పాటు పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
రామకృష్ణ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామకృష్ణ మరణం పత్రికా రంగానికి తీరని లోటని సీఎం పేర్కొన్నారు. రామకృష్ణ మరణం బాధాకరమని వయోధిక పాత్రికేయ సంఘం కార్యనిర్వాహకులు బండారు శ్రీనివాసరావు, లక్ష్మణరావు, సినీ పాత్రికేయుడు వినాయకరావు తదితరులు విచారం వ్యక్తం చేశారు. రామకృష్ణ భౌతికకాయాన్ని అమీర్పేటలోని సారథి స్టూడియో దగ్గర అస్విన్ అపార్ట్మెంట్లో బంధుమిత్రుల సందర్శనార్థం ఉంచారు. శనివారం ఉదయం 11 గంటలకు సనత్నగర్ ఈఎ్సఐ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇవి కూడా చదవండి
ఆర్సీబీ ఓడిపోతే భర్తకు విడాకులు ఇస్తుందట.. ఇదేం పిచ్చి..
ఐఎన్ఎస్ విక్రాంత్ పైనుంచి పాకిస్థాన్కు రాజ్నాథ్ సింగ్ వార్నింగ్