Share News

Jagga Reddy: కేసీఆర్‌ను దేవుడంటూనే ఆయన కొంప ముంచుతున్నవ్‌

ABN , Publish Date - May 26 , 2025 | 04:33 AM

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత.. కేసీఆర్‌ను దేవుడంటూనే ఆయన కొంప ముంచుతోందని, రాష్ట్రంలో బీజేపీకి బలం చేకూరేలా చేస్తోందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

Jagga Reddy: కేసీఆర్‌ను దేవుడంటూనే ఆయన కొంప ముంచుతున్నవ్‌

బీజేపీకి బలం చేకూరుస్తున్నవ్‌.. నీ లేఖలు.. లీకులతో బీఆర్‌ఎ్‌సలో గందరగోళం

  • పార్టీ నేతలను బీజేపీలోకి పంపే యత్నం

  • ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై తూర్పు జగ్గారెడ్డి

  • ఆమె సొంతంగా రాజకీయాల్లో ఎదగలేదు

  • ఈ ఎపిసోడ్‌తో కాంగ్రె్‌సకు నష్టమేమీ లేదు

  • బీజేపీకి లాభం జరగకుండా అప్రమత్తం కావాలి

  • రాహుల్‌ ప్రధాన శత్రువు బీజేపీ

  • మీడియాతో చిట్‌చాట్‌లో జగ్గారెడ్డి

హైదరాబాద్‌, మే 25 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత.. కేసీఆర్‌ను దేవుడంటూనే ఆయన కొంప ముంచుతోందని, రాష్ట్రంలో బీజేపీకి బలం చేకూరేలా చేస్తోందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. లేఖలు, లీకులతో బీఆర్‌ఎస్‌ నాయకులను గందరగోళానికి గురి చేస్తున్న ఆమె.. వారిని బీజేపీ వైపునకు మళ్లేలా చేస్తున్నదన్నారు. కవిత రాజకీయాల్లో నేరుగా ఎదిగిన వ్యక్తి కాదని, కేసీఆర్‌ పేరుతోనే ఆమె ఎదిగిందని చెప్పారు. ఆదివారం ఇక్కడ ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడూ కాంగ్రెస్‌ రాష్ట్రంలో బలంగానే ఉందని, కవిత ఎపిసోడ్‌తో తమ పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదని చెప్పారు. రాష్ట్రంలో మొదటి నుంచీ బలంగా లేని పార్టీ బీజేపీనేనన్నారు. అయితే ఈ ఎపిసోడ్‌తో కాంగ్రెస్‌ శత్రువైన బీజేపీకి లాభం చేకూరకుండా తాము అప్రమత్తం అవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. కవిత లేఖలతో కేసీఆర్‌ కుటుంబంలో కలకలం చోటు చేసుకుందని, ఏదో జరుగుతోందన్న చర్చ వారం రోజులుగా నడుస్తోందని, ఆమె కొత్త పార్టీ పెట్టనుందన్న చర్చా నడుస్తోందన్నారు. కేసీఆర్‌కు రాష్ట్ర విభజన అంశంతో ప్రజలు ఓటేస్తే.. కాంగ్రెస్‌ పార్టీకి పరిపాలనను చూసి ఓటేస్తారని చెప్పారు. మతం పేరుతో రాజకీయం చేసే పార్టీ బీజేపీ అని అన్నారు.


రాష్ట్ర రాజకీయాల్లో ఒకటి, రెండు స్థానాల్లో వరుసగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు ఉంటే.. బీజేపీ మూడో స్థానంలో ఉందన్నారు. ఈ తరుణంలో కేసీఆర్‌ కుటుంబంలో పంచాయతీ.. రాజకీయంగా బీఆర్‌ఎ్‌సకే నష్టమని పేర్కొన్నారు. కుటుంబ తగాదాతో ఆ పార్టీ నేతలు గందరగోళానికి గురై.. బీజేపీ వైపునకు మళ్లే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. ‘‘ఎవరికి వారు తాము ఏదో అనే ఫీలింగ్‌ మంచిది కాదు. ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకున్నా కేసీఆర్‌.. కేసీఆరే..! ఆయనతోనే బీఆర్‌ఎస్‌ పార్టీకి ఉనికి. కేటీఆర్‌, హరీశ్‌, కవితల వల్ల ఏమీ కాదు. కవిత ఏ చెట్టు నీడలో అయితే బతుకుతున్నదో.. ఆ చెట్టునే నరికివేస్తున్నది. కూర్చున్న చెట్టు కొమ్మనే నరుకుతునన్నట్లుగా ఆమె వ్యవహారం ఉన్నది’’ అని వ్యాఖ్యానించారు. డిప్రెషన్‌లో తొందర పడి లేఖలు రాసిన కవిత.. బీజేపీని పెంచి పోషించే పనిలో పడ్డారని ఆరోపించారు. ఈ మాత్రం రాజకీయ అవగాహన ఆమెకు లేదా అని అన్నారు.


కేసీఆర్‌ను దేవుడు అంటూనే ఆయనను రాజకీయ సమాధి చేస్తోందన్నారు. దేశ రాజకీయాల్లో రాహుల్‌గాంధీ ప్రధాన శత్రువు బీజేపీనే అని గుర్తు చేశారు. గందరగోళంలో ఉన్న బీఆర్‌ఎస్‌ శ్రేణులను కాంగ్రెస్‌ వైపునకు తెచ్చుకునే ప్రయత్నం చేయాలన్నారు. సమయం వచ్చినప్పుడు ఈ విషయాలు సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షగౌడ్‌ దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌తోనూ తన అభిప్రాయాలు పంచుకుంటానని చెప్పారు. కేసీఆర్‌.. రాజకీయంగా లోతైన ఆలోచన చేస్తారని, ఆయన గురించి కవితకు పూర్తిగా అవగాహన లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఆమె వల్ల ఏదీ కాదని, రాజకీయాలను ఆమె మలుపు తిప్పేదీ, ఆమె వల్ల రాజకీయాలు తారుమారు అయ్యేదీ లేదన్నారు. కేసీఆర్‌ కూతురు కాబట్టే మీడియాలో ఆమెకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

Shashi Tharoor: పార్టీ కోసమే పని చేస్తున్నా.. క్లారిటీ ఇచ్చిన శశిథరూర్

ponnam prabhakar: తల్లిదండ్రులు వారి పిల్లలను శక్తి మేర చదివించాలి: పొన్నం

Updated Date - May 26 , 2025 | 04:33 AM