రక్షణ రంగంలో ఎగుమతులు ప్రధాని మోదీ ప్రభుత్వ విజయమే
ABN , Publish Date - Jun 07 , 2025 | 04:11 AM
ఒకప్పుడు రక్షణ రంగ ఉత్పత్తులను దిగుమతి చేసుకునే దశ నుంచి ఇప్పుడు ఎగుమతులు చేసే స్థాయికి భారత్ ఎదిగిందని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ అన్నారు.

కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్
హైదరాబాద్, జూన్ 6(ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు రక్షణ రంగ ఉత్పత్తులను దిగుమతి చేసుకునే దశ నుంచి ఇప్పుడు ఎగుమతులు చేసే స్థాయికి భారత్ ఎదిగిందని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ అన్నారు. గతంలో బుల్లెట్ప్రూఫ్ జాకెట్లు కూడా దిగుమతి చేసుకునేవారమని ఆయన గుర్తుచేశారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు రక్షణ రంగ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నామని, ఇది ముమ్మాటికీ మోదీ ప్రభుత్వం సాధించిన విజయమన్నారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంజయ్ సేథ్ మాట్లాడారు. 2027 నాటికి ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా భారత్ ఎదగడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందని, భారత వైమానిక దళం కేవలం 23 నిమిషాల్లో 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిందన్నారు.