Kishan Reddy: క్లీన్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు అన్ని చర్యలు
ABN , Publish Date - Jun 07 , 2025 | 04:32 AM
కర్బన ఉద్గారాలను తక్కువగా విడుదల చేసే ఇంధనాలను(క్లీన్ ఎనర్జీ) ప్రోత్సహించడంలో భాగంగా లిథియం, కోబాల్ట్లతో పాటు అత్యంత అరుదైన ఖనిజ వనరులను..

క్రిటికల్ మినరల్స్ కోసం పలు దేశాలతో ఒప్పందాలు
కోల్ ఇండియా లాంటి కేంద్ర సంస్థలు విదేశాల్లో గనుల నుంచి క్రిటికల్ మినరల్స్ను వెలికితీయాలి
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ, జూన్ 6(ఆంధ్రజ్యోతి): కర్బన ఉద్గారాలను తక్కువగా విడుదల చేసే ఇంధనాలను(క్లీన్ ఎనర్జీ) ప్రోత్సహించడంలో భాగంగా లిథియం, కోబాల్ట్లతో పాటు అత్యంత అరుదైన ఖనిజ వనరులను(క్రిటికల్ మినరల్స్) వెలికితీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. అర్జెంటీనాలోని క్యాటామార్కా ప్రావిన్స్లో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ కాబిల్ ఇప్పటికే 15 వేల హెక్టార్ల ప్రాంతంలో లిథియాన్ని వెలికితీస్తోందని తెలిపారు. అరుదైన ఖనిజ వనరుల శుద్ధిపై శుక్రవారం ఢిల్లీలో జరిగిన సెమినార్లో కిషన్ రెడ్డి మాట్లాడారు.
కోల్ ఇండియా, హిందుస్థాన్ కాపర్, సింగరేణి సంస్థలు దేశంలో, విదేశాల్లో గనులను సొంతం చేసుకుని, ఖనిజాల వెలికితీత పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. విదేశాల్లో ఉన్న ఖనిజ వనరులను వెలికితీసి, దిగుమతి చేసుకోవడానికి ఆస్ట్రేలియా, అర్జెంటీనా, చిలీ వంటి దేశాలతో భారత్ ఇప్పటికే ద్వైపాక్షిక ఒప్పందం చేసుకున్నట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం భారత్ ఈ క్రిటికల్ మినరల్స్ను 100ు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోందన్నారు. 2040 నాటికి వీటి డిమాండ్ 4 నుంచి 6 రెట్లు పెరగనుందని కిషన్రెడ్డి చెప్పారు.