BREAKING: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆర్ఎస్ ప్రవీణ్కు నోటిసులు!
ABN , Publish Date - Jul 19 , 2025 | 01:25 PM
RS Praveen: ఫోన్ ట్యాపింగ్ కేసులో వాగ్మూలం కోసం ఆర్ఎస్ ప్రవీణ్కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉన్న ఆయన వాగ్మూలం ఇచ్చేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం తన ఫోన్ హ్యాక్ చేయడంతో పాటు ఫోన్ ట్యాప్ చేస్తున్నాని ఈసీకి, డీజీపీకి ప్రవీణ్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

హైదరాబాద్, జులై 19: ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో విచారణలో భాగంగా మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు (RS Praveen Kumar) సిట్ అధికారులు నోటీసులు అందించారు. నోటీసు అందుకున్న రెండు రోజుల్లో ఉదయం 11 నుండి సాయంత్రం 6 గంటల్లోపు వాగ్మూలం ఇచ్చేందుకు తమ కార్యాలయానికి రావాలని పేర్కొన్నారు. కాగా సిట్ (SIT) నోటీసులపై ప్రవీణ్ కుమార్ స్పందించలేదు.
వాగ్మూలం ఇచ్చేందుకు ఆయన నిరాకరించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్కు (BRS)వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాల్సి వస్తుందనే స్టేట్మెంట్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నట్లు సమాచారం. అయితే జులై 14 న ప్రవీణ్ కుమార్కు సిట్ నోటీసులు ఇవ్వగా ఆయన ఇంకా స్పందించలేదు. గతంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో.. బీఆర్ఎస్ ప్రభుత్వం తన ఫోన్ ను హ్యాక్ చేస్తుందని, ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడుతుందని కేంద్ర ఎన్నికల సంఘంతో డీజీపీకి ఆయన ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
అన్యమత ఉద్యోగులని సస్పెండ్ చేసిన టీటీడీ
ఏపీలో అమానుష ఘటన.. భార్యని హత్య చేసిన భర్త