MLA Palla Rajeshwar Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డికి ప్రమాదం.. ఏమైందంటే
ABN , Publish Date - Jun 11 , 2025 | 09:16 AM
జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డికి ప్రమాదం జరిగింది. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్హౌస్లో ప్రమాదవశాత్తూ పల్లా రాజేశ్వర్రెడ్డి జారిపడ్డారు. ఆయనకు తుంటి ఎముకలో గాయం అయింది. దీంతో హైదరాబాద్లోని యశోద ఆస్పత్రికి వైద్యం కోసం తరలించారు.

సిద్దిపేట: జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డికి (MLA Palla Rajeshwar Reddy) ప్రమాదం జరిగింది. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ఫామ్హౌస్లో ప్రమాదవశాత్తూ పల్లా రాజేశ్వర్రెడ్డి జారిపడ్డారు. జారీపడటంతో పల్లా తుంటి ఎముకలో గాయమైంది. దీంతో హైదరాబాద్లోని యశోద ఆస్పత్రికి వైద్యం కోసం తరలించారు.
కాగా ఇవాళ (బుధవారం) కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ని కలవడనికి బీఆర్ఎస్ కీలక నేతలు, కుటుంబ సభ్యులు గులాబీ బాస్ ఫాంహౌస్కి వెళ్లారు. ఈ క్రమంలోనే పల్లా రాజేశ్వర్రెడ్డి జారి పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేసీఆర్ ఫాంహౌస్లో మాజీ మంత్రులు హరీష్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్సీ కవిత దంపతులు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కేసీఆర్ మనవడు హిమాన్షు ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఎమ్మెల్యే రాజా సింగ్ మళ్లీ హాట్ కామెంట్స్
రాజీవ్ యువ వికాసం మరింత జాప్యం
For More Telangana News and Telugu News..