HYDRAA: CI పై హైడ్రా కమిషనర్ రంగనాథ్ సీరియస్
ABN , Publish Date - May 14 , 2025 | 05:56 PM
మారణాయుధాలతో దాడి చేస్తే, హత్యయత్నం కేసు పెట్టకపోవడంతో CI నాగరాజు పై ఆగ్రహం వ్యక్తం చేశారు రంగనాథ్.మీరు కొనుగోలు చేసిన స్థలాన్ని ఎవరైనా కబ్జా చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో

HYDRAA: హయత్ నగర్ CI నాగరాజు పై ఆగ్రహం వ్యక్తం చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. కోహెడ సర్వే నెంబర్ 951,952లో వివాదాస్పద భూమిని పరిశీలించిన కమిషనర్ రంగనాథ్, వివాదాస్పద భూమిలో మారణాయుధాలను చూసి అవాక్కయ్యారు. స్థలం కొనుగోలుదారులకుకి, ఫాంహౌస్ యజమానికి మధ్య గత కొంత కాలంగా ఈ స్థలం విషయమై వివాదం నడుస్తోంది. ప్లాటు యజమానులపై మారణాయుధాలతో దాడి చేస్తే, హత్యయత్నం కేసు పెట్టకపోవడంతో CI నాగరాజు పై ఆగ్రహం వ్యక్తం చేశారు రంగనాథ్.మీరు కొనుగోలు చేసిన స్థలాన్ని ఎవరైనా కబ్జా చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది అని CI ని ప్రశ్నించారు రంగనాథ్. ఇక్కడ జరుగుతున్న పరిణామాలతోనే హైడ్రా పోలీసు స్టేషన్ ఏర్పాటు చేసినట్టు బాధితులకు భరోసా ఇచ్చారు రంగనాథ్.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కొహెడ గ్రామంలోని రాజాజీ నగర పేరిట వేసిన లే ఔట్ ను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దాదాపు 17 ఎకరాల విస్తీర్ణంలో 190 వరకు ప్లాట్లతో ఉన్న లేఅవుట్ లోని పార్కులు, రహదారులు కలిపేసి సమ్మిరెడ్డిబాల్ రెడ్డి తప్పుడు ధ్రువపత్రాలతో తమ ప్లాట్లను కబ్జా చేశారంటూ అక్కడి ప్లాట్ యజమానులు గతంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేసారు. ఆక్రమణలను, రహదారులకు అడ్డంగా నిర్మించిన కట్టడాలను హైడ్రా తొలగించింది. దీంతో ప్లాట్ యజమానులు ఊపిరి పీల్చుకున్నా రు.
ఇవి కూడా చదవండి
Penny Stock: ఈ స్టాక్పై రూ.4 లక్షల పెట్టుబడి..ఏడేళ్ల లోనే రూ.56 లక్షల లాభం..
Investment Tips: ఒకేసారి రూ.3.5 లక్షల పెట్టుబడి..కానీ వచ్చేది మాత్రం కోటి, ఎలాగంటే..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
కల్నల్ ను అంతమాటా..!