Singapore: మార్క్ శంకర్ను చూసేందుకు సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ ..
ABN , Publish Date - Apr 09 , 2025 | 08:00 AM
సింగపూర్లో మంగళవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖతో కలసి సింగపూర్ బయలుదేరి వెళ్లారు. ప్రస్తుతం శంకర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి (AP Deputy CM) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్ శంకర్ (Mark Shankar) అగ్నిప్రమాదం (Fire Accident)లో గాయపడిన విషయం తెలియగానే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఆయన సతీమణి సురేఖ (Surekha) సింగపూర్కు (Singapore) బయల్దేరారు. శంకర్ను చూసేందుకు, ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేందుకు వెళుతున్నారు. బాలుడికి అవసరమైన మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా శంకర్ ఆరోగ్య పరిస్థితిపై అధికారిక సమాచారం త్వరలో వెలువడనుంది. మంగళవారం ఉదయం సింగపూర్ స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో పవన్ కళ్యాణ్ కుమారుడు. మార్క్ శంకర్ గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Also Read..: Today Gold Rate: తగ్గిన బంగారం, వెండి ధరలు..
సింగపూర్ స్కూల్లో అగ్ని ప్రమాదం
సింగపూర్లో మంగళవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడు. మంటల కారణంగా చేతులు, కాళ్లపై బొబ్బలు ఏర్పడ్డాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ చేరుకోవడంతో శ్వాస సంబంధిత సమస్యను ఎదుర్కొన్నాడు. ఏడేళ్ల మార్క్ శంకర్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు జనసేన పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, ఈ ఘటనలో పదేళ్ల విద్యార్థిని మృతి చెందగా.. మరో 20 మంది వరకు గాయపడ్డారు. వీరిలో 15 మంది వరకు చిన్నారులు ఉన్నారు. అగ్నిప్రమాదం జరిగిందని తెలిసినప్పుడు అరకు పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మంగళవారం రాత్రి 9:30 గంటలకు సింగపూర్ బయల్దేరి వెళ్లారు.
అసలు ఏం జరిగింది..
సింగపూర్లోని సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ (సీబీడీ) సమీపంలోని రివర్ వ్యాలీ రోడ్డులో మూడు అంతస్థుల భవనం ఉంది. అందులో పలు దుకాణాలతోపాటు.. చిన్నారులకు రోబోటిక్ ఇనిస్టిట్యూట్ను నిర్వహిస్తున్నారు. ఈ భవనంలోనే 30 మంది స్కూల్ పిల్లలకు సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేశారు. వారిలో పవన్ కుమారుడు మార్క్ శంకర్ కూడా ఉన్నాడు. ఈ క్రమంలో స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో ఈ భవనంలో ఒక్కసారిగా మంటలు రాజుకుని అగ్ని ప్రమాదం సంభవించింది. ఘటనపై సమాచారం అందగానే సింగపూర్ హోంశాఖ మంత్రి కె. షణ్ముగం హుటాహుటిన స్పందించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించేందుకు యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేశారు. ఫైర్ ఇంజన్లను రంగంలోకి దింపారు. అయితే.. సహాయక చర్యలు చేపట్టే సమయానికే 10 ఏళ్ల బాలిక మంటల్లో చిక్కుకుని మృతి చెందినట్టు మంత్రి తెలిపారు. ఈ ఘటనలో మరో 20 మంది వరకు గాయపడ్డారని, వీరిలో 15 మంది చిన్నారులే ఉన్నారని సింగపూర్ పౌర రక్షణ దళం ఫేస్బుక్లో పేర్కొంది. ఇదిలావుంటే.. ఈ ఘటనకు సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. భవనం మూడో అంతస్థు నుంచి దట్టమైన పొగ బయటకు రావడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఆ సమయంలో చిన్నారులు.. ప్రాణభయంతో అరుపులు కేకలు పెట్టారు. ఈ సమయంలో కొందరు భవన నిర్మాణ కార్మికులు, స్థానికులు పరంజాల ద్వారా భవనంపైకి ఎక్కి వారిని రక్షించే ప్రయత్నాలు చేయడం వీడియోలో కనిపించింది. ఈలోగా అక్కడకు చేరుకున్న అగ్నిమాపక వాహనాలు.. మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశాయి. అదేసమయంలో కొందరు ఆయా వాహనాలకు ఉన్న నిచ్చెనల ద్వారా మూడో అంతస్థుకు చేరుకుని బాధిత చిన్నారులను బయటకు తీసుకువచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు.. భవనంలోని మరో 80 మందిని అక్కడ నుంచి బయటకు తరలించారు. అగ్నిప్రమాదంలో గాయపడిన వారికి అత్యవసర చికిత్స అందిస్తున్నట్టు కేకే ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్ ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ శశికుమార్ గణపతి తెలిపారు. అగ్ని ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదని.. దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
H-1B visa: అమెరికా.. కలలు కల్లలు
పీ4 పటిష్ఠ అమలుకు ప్రత్యేక సొసైటీ
For More AP News and Telugu News