Share News

TS High Court: సీఎం రేవంత్ రెడ్డి , కేటీఆర్, జగదీష్ రెడ్డి పిటిషన్లపై విచారణ

ABN , Publish Date - Jun 13 , 2025 | 09:20 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేటీఆర్, జగదీష్ రెడ్డి పిటిషన్లు ఇవాళ హైకోర్టులో విచారణకు వచ్చాయి. ఈ రెండు వేర్వేరు కేసుల్లో విచారణను హైకోర్టు 20వ తేదీకి వాయిదా వేసింది. ఇంతకీ ఆయా కేసుల వివరాల్లోకి వెళ్తే..

TS High Court: సీఎం రేవంత్ రెడ్డి , కేటీఆర్, జగదీష్ రెడ్డి పిటిషన్లపై విచారణ
TS High Court

ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను ఇవాళ తెలంగాణ హైకోర్టు విచారించింది. తదుపరి విచారణ 20వ తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే, 9 ఏళ్ల క్రితం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో రేవంత్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు కొండల్ రెడ్డి, లక్ష్మణ్ లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. గచ్చిబౌలి పిఎస్‌లో నమోదైన ఈ కేసును కొట్టివేయాలని రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ నేపథ్యంలో ఫిర్యాదు దారుడైన పెద్దిరాజుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కాగా, గోపన్‌పల్లిలోని వివాదాస్పద భూమిలో ఉన్న సొసైటీ గదిని జెసిబితో కూల్చారని పెద్దిరాజు అనే వ్యక్తి రేవంత్ రెడ్డితోపాటు కొండల్ రెడ్డి, లక్ష్మణ్ లపై కేసు పెట్టాడు. తనను కులం పేరుతో దూషించారని పెద్దిరాజు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు.. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు నమోదు చేశారు. ఈ కేసును 20వ తేదీకి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.


ఇక, మరో కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జగదీశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ల పైనా ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో తదుపరి విచారణను 20వ తేదీకి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఇక కేసు వివరాల్లోకి వెళ్తే, మేడిపల్లి పిఎస్‌లో తమపై నమోదైన కేసును కొట్టేయాలని కేటీఆర్, జగదీశ్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఫేక్ వీడియో సృష్టించి ప్రచారం చేశారని కేటీఆర్, జగదీశ్ రెడ్డి పై తీన్మార్ మల్లన్న చేసిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. అయితే, గత విచారణ సందర్భంగా పోలీసులకు, తీన్మార్ మల్లన్నకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. మళ్లీ ఇవాళ ఈ కేసుపై విచారణ జరుగగా, తీన్మార్ మల్లన్న తరపు న్యాయవాది కోర్టుకు హాజరు కాలేదు. దీంతో కోర్టు విచారణకు హాజరు కావడానికి తీన్మార్ మల్లన్నకు చివరి అవకాశం ఇస్తూ తదుపరి విచారణను 20వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.


ఇవి కూడా చదవండి..

ఇరాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. అమెరికా షాకింగ్ నిర్ణయం..

ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్.. ఇరాన్ న్యూక్లియర్ సైట్లపై దాడులు

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 13 , 2025 | 09:20 PM