Share News

Rythu Bharosa: డబ్బులు పడ్డాయ్.. చెక్ చేసుకోండి..

ABN , Publish Date - Jun 19 , 2025 | 03:31 PM

తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైతు భరోసా నిధులను విడుదల చేస్తోంది. తాజాగా మరో రూ. 1189.43 కోట్లను విడుదల చేసింది. ఐదు ఎకరాల వరకు రైతు భరోసా నిధులు జమ చేసిన సర్కార్..

Rythu Bharosa: డబ్బులు పడ్డాయ్.. చెక్ చేసుకోండి..
Rythu Bharosa

హైదరాబాద్, జులై 19: తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైతు భరోసా నిధులను విడుదల చేస్తోంది. తాజాగా మరో రూ. 1189.43 కోట్లను విడుదల చేసింది. ఐదు ఎకరాల వరకు రైతు భరోసా నిధులు జమ చేసిన సర్కార్.. గురువారం నాడు మరికొంత మంది రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసింది. అధికారిక సమాచారం ప్రకారం.. గురువారం నాడు 4,43,167 మంది రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు జమ చేసింది. ఇప్పటి వరకు 62.47 లక్షల మంది రైతుల ఖతాల్లో రూ. 6404.7 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. ఇక భూమి పరంగా చూసుకుంటే.. 106 లక్షల ఎకరాకు పంట సహాయం అందించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Updated Date - Jun 19 , 2025 | 03:35 PM