Share News

ACB: భవనాలకు అనుమతి కోసం 8 లక్షలు డిమాండ్‌

ABN , Publish Date - May 24 , 2025 | 04:14 AM

విధి నిర్వహణలో అవినీతికి పాల్పడుతూ నలుగురు అధికారులు, సిబ్బంది శుక్రవారం ఏసీబీకి చిక్కారు. ఆ నలుగురినీ ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌ జోన్‌ పరిధిలో వెంకట్‌రావు అనే వ్యక్తి రెండు భవనాలు నిర్మించుకున్నారు.

ACB: భవనాలకు అనుమతి కోసం 8 లక్షలు డిమాండ్‌

  • ఏసీబీకి చిక్కిన సికింద్రాబాద్‌ జోన్‌ అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ విఠల్‌

  • 4 లక్షలే ఇచ్చి మిగతా సొమ్ము ఇవ్వలేదని దరఖాస్తు తిరస్కరణ

  • బాధితుడి ఫిర్యాదుతో దాడి చేసి అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు

  • లంచం తీసుకుంటూ పట్టుబడిన కామారెడ్డి జిల్లా కోర్టు ఏపీపీ, కానిస్టేబుల్‌.. పెద్దశంకరంపేట ఇన్‌చార్జి ఎంపీడీవో..

సికింద్రాబాద్‌/కామారెడ్డిటౌన్‌/పెద్ద శంకరంపేట, మే 23 (ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో అవినీతికి పాల్పడుతూ నలుగురు అధికారులు, సిబ్బంది శుక్రవారం ఏసీబీకి చిక్కారు. ఆ నలుగురినీ ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌ జోన్‌ పరిధిలో వెంకట్‌రావు అనే వ్యక్తి రెండు భవనాలు నిర్మించుకున్నారు. వాటికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ (ఓసీ) కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది మార్చి 4న ఆ భవనాలను పరిశీలించిన అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ విఠల్‌.. ఓసీలు ఇచ్చేందుకు రూ.8లక్షలు లంచం డిమాండ్‌ చేశారు. దీంతో వెంకట్‌రావు చేసేదేమీ ఈ నెల 12న విఠల్‌కు రూ.4 లక్షలు ఇచ్చారు. తర్వాత మిగతా రూ.4లక్షలు ఇవ్వాలని విఠల్‌ పట్టుబట్టగా, ఇవ్వలేనని వెంకట్‌రావు చెప్పడంతో.. ఓసీ దరఖాస్తులను విఠల్‌ తిరస్కరించారు. దీనితో 3 రోజుల క్రితం వెంకట్‌రావు ఏసీబీని ఆశ్రయించగా.. అధికారులు శుక్రవారం దాడి చేసి విఠల్‌ను అరెస్టు చేశారు.


నల్లకుంటలోని విఠల్‌ ప్రైవేటు కార్యాలయంతోపాటు మేడిపల్లిలోని విఠల్‌ నివాసంలో సోదాలు చేపట్టామని ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌ తెలిపారు. ఇక కామారెడ్డి పోలీసు స్టేషన్‌లో 2018లో నమోదైన ఓ కేసులో.. ఓ వ్యక్తికి అనుకూలంగా వ్యవహరించేందుకు కామారెడ్డి జిల్లా జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (ఏపీపీ) గుగులోత్‌ అశోక్‌ శివరామ్‌నాయక్‌, పట్టణ పోలీసుస్టేషన్‌ కానిస్టేబుల్‌ నిమ్మ సంజయ్‌ రూ.10 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఇక మెదక్‌ జిల్లా పెద్దశంకరంపేట మండలం ఇన్‌చార్జి ఎంపీడీవో విఠల్‌రెడ్డి.. డ్రైనేజీ పనుల బిల్లులు మంజూరు చేసేందుకు రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయారు.


ఇవి కూడా చదవండి

Genelia D Souza: డ్రైవర్ తొందరపాటు.. జెనీలియాకు తప్పిన పెను ప్రమాదం

Viral Video: ఇండియన్ ఆక్వామ్యాన్.. ఉప్పొంగుతున్న మ్యాన్‌ హోల్‌లోంచి..

Updated Date - May 24 , 2025 | 04:14 AM