పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి
ABN , Publish Date - Jun 15 , 2025 | 04:35 AM
పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మాజీ సర్పంచులు డిమాండ్ చేశారు.

పోరుబాట పట్టిన మాజీ సర్పంచులు
పంజాగుట్ట, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మాజీ సర్పంచులు డిమాండ్ చేశారు. అప్పులు చేసి మరీ గ్రామాల్లో అభివృద్థి పనులు చేశామని, కానీ ప్రభుత్వం ఇప్పటివరకు బిల్లులు చెల్లించకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. శనివారం ఖైరతాబాద్లోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కార్యాలయం గేటుకు వినతిపత్రాన్ని ముడుపు కట్టి వినూత్న రీతిలో మాజీ సర్పంచులు నిరసన తెలిపారు. అనంతరం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో తెలంగాణ సర్పంచుల జేఏసీ నేతలు మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే బకాయిలు వెంటనే చెల్లిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, ప్రభుత్వం వచ్చి18 నెలలైనా ఒక్క బిల్లు రాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. అప్పుల బాధతో కొంతమంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. సొంత డబ్బులతో అభివృద్ధి పనులు చేస్తే తమకు బిల్లులు చెల్లించకుండా.. బడా కాంట్రాక్టర్లకు మాత్రం ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు. రూ.650 కోట్ల మేర పెండింగ్ బిల్లులు రావాల్సి ఉందని, రెండు, మూడు రోజుల్లో తమకు బకాయిలు చెల్లించాలని, లేని పక్షంలో ఇందిరాపార్కు వద్ద దీక్షలు చేపడతామని జేఏసీ నేతలు హెచ్చరించారు.
ఇజ్రాయెల్ మారణహోమాన్ని ఆపాలి
వామపక్ష పార్టీల డిమాండ్
హైదరాబాద్, జూన్ 14(ఆంధ్రజ్యోతి): పాలస్తీనా ప్రజలపై 20 నెలలుగా దాడులకు పాల్పడుతున్న ఇజ్రాయెల్ తక్షణమే మారణహోమాన్ని ఆపాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశా యి. సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నేతలు మాట్లాడారు. ఆసుపత్రులు, పాఠశాలలు, శరణార్థుల శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతుందని, ఇప్పటికే 50వేల మంది మరణించారన్నారు. భారత ప్రభుత్వం పాలస్తీనా ప్రజలకు అం డగా నిలవాలని కోరారు. ఈ నెల 19న రాష్ట్ర వ్యాప్తంగా పాలస్తీనాకు సంఘీభావంగా వామపక్షాల నేతృత్వంలో జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆస్ట్రేలియాను చిత్తు చేసి.. 27 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా..
మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..
For National News And Telugu News