Enforcement Directorate: బెట్టింగ్ యాప్ సంస్థల్లో ఈడీ సోదాలు
ABN , Publish Date - Aug 13 , 2025 | 05:48 AM
దేశవ్యాప్తంగా ఉన్న పలు బెట్టింగ్ యాప్ సంస్థల కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు మంగళవారం ఏకకాలంలో తనిఖీలు జరిపారు.
హైదరాబాద్ సహా 15 చోట్ల తనిఖీలు
రూ.2000 కోట్ల లావాదేవీల గుర్తింపు
హైదరాబాద్, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా ఉన్న పలు బెట్టింగ్ యాప్ సంస్థల కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు మంగళవారం ఏకకాలంలో తనిఖీలు జరిపారు. ఈ సంస్థలు అంతర్జాతీయ స్పోర్ట్స్, బెట్టింగ్ సంస్థ ‘పరిమ్యాచ్’ పేరిట అక్రమంగా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు ఈడీ గుర్తించింది. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, జైపూర్, మదురై, సూరత్ తదితర 15 ప్రాంతాల్లో ఈడీ ముంబై జోనల్ యూనిట్ అధికారులు సోదాలు నిర్వహించారు.
ముంబై సైబర్క్రైమ్స్ పోలీ్సస్టేషన్లో 2024లో నమోదైన ఎఫ్ఐఆర్ మేరకు మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద తనిఖీలు చేపట్టినట్లు అధికారులు వివరించారు. ఈ అక్రమాల్లో దాదాపు రూ.2000 కోట్ల లావాదేవీలు చోటుచేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసిన బీఆర్ఎస్
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు
Read Latest Telangana News And Telugu News