Shadnagar: దాబా హోటల్లో మత్తు!
ABN , Publish Date - May 31 , 2025 | 03:46 AM
షాద్నగర్ సమీపంలోని రాయికల్ టోల్ప్లాజా దగ్గర ఉన్న సంజుభాయ్ మార్వాడి దాబాలో ఏళ్లుగా కొనసాగిస్తున్న డ్రగ్స్ దందా గుట్టు రట్టయింది. కేసు వివరాలను శుక్రవారం సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి వెల్లడించారు.

షాద్నగర్ మార్వాడి దాబాలో గుట్టుగా డ్రగ్స్ విక్రయం
రూ.3.05 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్నలుగురి అరెస్టు
హైదరాబాద్ సిటీ, షాద్నగర్, మే 30 (ఆంధ్రజ్యోతి): షాద్నగర్ సమీపంలోని రాయికల్ టోల్ప్లాజా దగ్గర ఉన్న సంజుభాయ్ మార్వాడి దాబాలో ఏళ్లుగా కొనసాగిస్తున్న డ్రగ్స్ దందా గుట్టు రట్టయింది. కేసు వివరాలను శుక్రవారం సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి వెల్లడించారు. రాజస్థాన్కు చెందిన వికాస్ సోహూ(26) సంజుభాయ్ దాబాలో 2019లో వంట మనిషిగా పనికి కుదిరాడు. యజమాని సంజూ భాయ్కి గంజాయి పీల్చే అలవాటు ఉంది. ధూల్పేటకు చెందిన సలీం నుంచి కొనేవాడు. దాబాకు వచ్చిన కస్టమర్లలో ఎవరైనా అడిగితే ఎక్కువ ధరకు విక్రయించేవాడు. యజమాని దన్ను చూసుకొని వికాస్ కూడా గంజాయి అమ్మేవాడు. మధ్యప్రదేశ్కు చెందిన గణపత్ అనే వ్యక్తి.. సంజూభాయ్, వికా్సకు హెరాయిన్, ఓపీఎం, పాపీ స్ట్రాలను సరఫరా చేసేవాడు. కాగా 2022లో జడ్చర్ల బస్టాండ్ సమీపంలో సంజూభాయ్, వికాస్ గంజాయిని విక్రయిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. జైలుకెళ్లొచ్చాక మళ్లీ గంజాయిని విక్రయిస్తున్నారు.
వీరికి గంజాయిని జల్పల్లి ప్రాంతానికి చెందిన రాజు సరఫరా చేసేవాడు. గత ఏప్రిల్ 25వ సంజూభాయ్ అనారోగ్యంతో చనిపోయాడు. ఆ తర్వాత దాబాను పూర్తిగా అధీనంలోకి తెచ్చుకున్న వికాస్ ఒక్కడే గంజాయి, డ్రగ్స్ను విక్రయించేవాడు. వారం కిత్రం వికాస్ 1.5 కిలోల హెరాయిన్ను, 750 గ్రాముల ఓపీఎంను 3.5 కిలోల పాపీ స్ర్టాను గణపత్ నుంచి కొనుగోలు చేయగా.. రాజు నుంచి 1.5 కిలోల గంజాయిని కొని విక్రయిస్తున్నాడు. పక్కా సమాచారంతో ఎస్వోటీ శంషాబాద్ బృందం, షాద్నగర్ పోలీసులు దాబాపై దాడి చేశారు. 1.5 కేజీల హెరాయిన్తో పాటు, కిలో ఎండు గంజాయి, 632గ్రాముల ఓపీఎం, పాపీ స్ర్టా 2.80 కేజీల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. వికా్సను షాద్నగర్లో.. గణపత్, సలీం, రాజులను హైదరాబాద్లో అరెస్టు చేశారు.
ఇవి కూడా చదవండి
ఆర్సీబీ ఓడిపోతే భర్తకు విడాకులు ఇస్తుందట.. ఇదేం పిచ్చి..
ఐఎన్ఎస్ విక్రాంత్ పైనుంచి పాకిస్థాన్కు రాజ్నాథ్ సింగ్ వార్నింగ్