Dog Attack: ఐదేళ్ల బాలిక ప్రాణం తీసిన పిచ్చికుక్క
ABN , Publish Date - May 29 , 2025 | 05:06 AM
ఓ పిచ్చికుక్క, ఐదేళ్ల బాలిక ప్రాణాలు తీసింది. కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం లక్ష్మీదేవిపల్లికి చెందిన బానోత్ రమేశ్, స్వప్న దంపతుల కుమార్తె నిహారిక గాయత్రి

ఇంటిముందు ఆడుకుంటుండగా దాడి
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
సుజాతనగర్, మే 28 (ఆంధ్రజ్యోతి): ఓ పిచ్చికుక్క, ఐదేళ్ల బాలిక ప్రాణాలు తీసింది. కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం లక్ష్మీదేవిపల్లికి చెందిన బానోత్ రమేశ్, స్వప్న దంపతుల కుమార్తె నిహారిక గాయత్రి (5) ఈనెల 13న ఇంటి ముందు ఆడుకుంటుండగా ఓ పిచ్చికుక్క ఆ చిన్నారిపై దాడి చేసింది. కుటుంబసభ్యులు కొత్తగూడెంలోని జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యం చేసిన డాక్టర్లు వ్యాక్సిన్ వేసి, మందులిచ్చి ఇంటికి పంపారు.
25న ఆ చిన్నారి వింతగా ప్రవర్తిస్తుండటం, నోట్లో నుంచి నురగలు వచ్చి అస్వస్థతకు గురవడంతో అదేరోజు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది.
Also Read:
తెలంగాణ హైకోర్టు కొత్త సీజే ఎవరంటే
For More Telangana News and Telugu News..