శంషాబాద్ టు వియత్నాం.. విమాన సర్వీసును ప్రారంభించిన జీఎంఆర్
ABN , Publish Date - May 09 , 2025 | 11:13 AM
శంషాబాద్ టు వియత్నాం.. నూతన విమాన సర్వీ్సును ప్రారంభించారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ విమాన సేవలు అందుబాటులో ఉండగా ఇప్పుడు వియత్నాం విమాన సేవలు అందుబాటులోకి వచ్చాయి. వియత్నాం రాజధాని హనోయ్కు నూతన విమాన సర్వీ్సును ప్రారంభించారు.

హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వియత్నాం రాజధాని హనోయ్కు నూతన విమాన సర్వీసును ప్రారంభించినట్లు జీఎంఆర్ అధికారులు తెలిపారు. వియత్నాం ఎయిర్లైన్స్ శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి వారానికి (ఆది, బుధ, శుక్ర) మూడు రోజులు ఈ విమానాలు రాకపోకలు సాగిస్తాయని జీఎంఆర్ సీఈవో ప్రదీప్ ఫణీకర్ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: అరెస్ట్ పేరుతో భయపెట్టి.. రూ.1.23 కోట్లు కొట్టేసి..
వియత్నాంకు విమాన ప్రయాణికుల రద్దీ పెరగడంతోనే ఈ విమాన సర్వీసులు ప్రారంభించామని చెప్పారు. వీటితోపాటు మరికొన్ని ప్రాంతాలకు విమాన సర్వీసులను విస్తరిస్తామని తెలిపారు. దేశీయ విమాన సర్వీసులతో పాటు అంతర్జాతీయ విమాన సర్వీసుల కనెక్ట్విటీని ప్రయాణికులకు అనుగుణంగా పెంచుతామని వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Breaking News: భారత్-పాక్ యుద్ధంపై చైనా తాజా రియాక్షన్ ఇదే..
ToDay Gold Rates: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..
మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజర్ చనిపోయాడా ..?
Operation Sindoor: యుద్ధ బీభత్సం
Read Latest Telangana News and National News