Share News

శంషాబాద్‌ టు వియత్నాం.. విమాన సర్వీసును ప్రారంభించిన జీఎంఆర్‌

ABN , Publish Date - May 09 , 2025 | 11:13 AM

శంషాబాద్‌ టు వియత్నాం.. నూతన విమాన సర్వీ్‌సును ప్రారంభించారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ విమాన సేవలు అందుబాటులో ఉండగా ఇప్పుడు వియత్నాం విమాన సేవలు అందుబాటులోకి వచ్చాయి. వియత్నాం రాజధాని హనోయ్‌కు నూతన విమాన సర్వీ్‌సును ప్రారంభించారు.

 శంషాబాద్‌ టు వియత్నాం..  విమాన సర్వీసును ప్రారంభించిన జీఎంఆర్‌

హైదరాబాద్: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వియత్నాం రాజధాని హనోయ్‌కు నూతన విమాన సర్వీసును ప్రారంభించినట్లు జీఎంఆర్‌ అధికారులు తెలిపారు. వియత్నాం ఎయిర్‌లైన్స్‌ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి వారానికి (ఆది, బుధ, శుక్ర) మూడు రోజులు ఈ విమానాలు రాకపోకలు సాగిస్తాయని జీఎంఆర్‌ సీఈవో ప్రదీప్‌ ఫణీకర్‌ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: అరెస్ట్ పేరుతో భయపెట్టి.. రూ.1.23 కోట్లు కొట్టేసి..


city7.2.jpg

వియత్నాంకు విమాన ప్రయాణికుల రద్దీ పెరగడంతోనే ఈ విమాన సర్వీసులు ప్రారంభించామని చెప్పారు. వీటితోపాటు మరికొన్ని ప్రాంతాలకు విమాన సర్వీసులను విస్తరిస్తామని తెలిపారు. దేశీయ విమాన సర్వీసులతో పాటు అంతర్జాతీయ విమాన సర్వీసుల కనెక్ట్‌విటీని ప్రయాణికులకు అనుగుణంగా పెంచుతామని వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి

Breaking News: భారత్-పాక్ యుద్ధంపై చైనా తాజా రియాక్షన్ ఇదే..

ToDay Gold Rates: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

నవ్వించడమే సింగిల్‌ లక్ష్యం

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజర్ చనిపోయాడా ..?

Operation Sindoor: యుద్ధ బీభత్సం

Read Latest Telangana News and National News

Updated Date - May 09 , 2025 | 11:13 AM