Congress: అబద్ధాల కోరులా ఆర్ఎస్ ప్రవీణ్: మేడిపల్లి సత్యం
ABN , Publish Date - Jun 14 , 2025 | 03:17 AM
బీఆర్ఎస్ హయాంలో పదేళ్ల పాటు ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకపోయినా మాట్లాడని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. నేడు విద్యారంగం నాశనమైందనడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.

కాంగ్రె్సపై ఎంపీ ఆర్.కృష్ణయ్య విమర్శలు విడ్డూరం: ఈరవత్రి
హైదరాబాద్, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): బీఆర్ఎస్ హయాంలో పదేళ్ల పాటు ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకపోయినా మాట్లాడని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. నేడు విద్యారంగం నాశనమైందనడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. కేటీఆర్ సహవాసంతో ఆర్ఎస్ ప్రవీణ్ అబద్ధాలు నేర్చుకుని కాకమ్మ కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. గురుకులాల కార్యదర్శిగా ఎనిమిదేళ్ల పాటు పనిచేసిన ఆయన విద్యారంగాన్ని ఏం ఉద్ధరించాడో చెప్పాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేసి గందరగోళంగా మార్చితే సంస్కరించి గాడిలో పెట్టేందుకు సీఎం రేవంత్రెడ్డి స్వయంగా విద్యాశాఖను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. బీసీల కోసం పోరాడుతున్న కాంగ్రె్సను ఎంపీ ఆర్.కృష్ణయ్య విమర్శించడం తగదని ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ అన్నారు. బీసీల కోసం రాహుల్ పోరాడడంతోనే కేంద్రం కులగణనకు ముందుకొచ్చిందని గుర్తు చేశారు. కృష్ణయ్యకు చిత్తశుద్ధి ఉంటే బీసీ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు.