Share News

పోరాటమనే పునాదిపైన.. పిడికిలి పీఠం ఎక్కిన తల్లి

ABN , Publish Date - Jun 03 , 2025 | 03:48 AM

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, ‘జయహో తెలంగాణ తల్లి’ అంటూ సాగే ఓ కొత్త గీతాన్ని ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. ‘‘పచ్చని చీర కట్టుకుని.. వరి కంకులు చేతబట్టుకుని.. చైతన్యానికి సంకేతంగా ఎర్రని బొట్టే పెట్టుకుని..

పోరాటమనే పునాదిపైన.. పిడికిలి పీఠం ఎక్కిన తల్లి

  • ‘జయహో తెలంగాణ తల్లి’ గీతాన్ని.. ‘ఎక్స్‌’లో పోస్టు చేసిన సీఎం రేవంత్‌

  • గీతాన్ని రచించి ఆలపించిన చంద్రబోస్‌

  • అమరుల త్యాగఫలం తెలంగాణ వారి ఆశయాల సంకల్పం ప్రజాపాలన: సీఎం

హైదరాబాద్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, ‘జయహో తెలంగాణ తల్లి’ అంటూ సాగే ఓ కొత్త గీతాన్ని ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. ‘‘పచ్చని చీర కట్టుకుని.. వరి కంకులు చేతబట్టుకుని.. చైతన్యానికి సంకేతంగా ఎర్రని బొట్టే పెట్టుకుని.. సౌభాగ్యానికి ప్రతిబింబంగా మెడలో నగలే వేసుకుని.. మా బతుకులనే తీర్చిదిద్దగా నిలువెత్తు బతుకమ్మవై.. పోరాటమనే పునాదిపైన.. పిడికిలి పీఠం ఎక్కిన తల్లి.. తెలంగాణ తల్లి.. జయహో తెలంగాణ తల్లి’’ అంటూ సాగే ఈ గీతాన్ని.. ప్రముఖ సినీ గేయ రచయిత, ఆస్కార్‌ అవార్డు గ్రహీత చంద్రబోస్‌ రచించి, స్వయంగా ఆలపించారు. కాగా, ‘‘త్యాగం.. ఆశయ రూపమై.. నగరం నడిబొడ్డున నిలువెత్తు చిహ్నమై.. దివికేగిన వీరుల స్మృతిలో.. గన్‌ పార్క్‌ అమరవీరుల స్తూపం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఘన నివాళి అర్పించాను’’ అంటూ సీఎం రేవంత్‌ ‘ఎక్స్‌’లో మరో పోస్టు చేశారు. ‘‘అమరవీరులారా.. మీ త్యాగాల ఫలితం ఈ రాష్ట్రం. మీ ఆశయాల సంకల్పం.. ఈ ప్రజాపాలన’’ అని పేర్కొన్నారు. దీంతోపాటు ‘‘వారి కలం.. వారి గళం.. స్వరాష్ట్ర ఉద్యమ భాస్వరం. వారి ఆట.. వారి పాట.. పోరాటాలకు రాచబాట. అటువంటి తొమ్మిది మంది కవులు, కళాకారులు, సాహితీవేత్తలను రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా రూ.కోటి నగదు పురస్కారంతో రాష్ట్ర ప్రజల తరపున గౌరవించుకున్నాం’’ అని ‘ఎక్స్‌’లో సీఎం తెలిపారు.


చంద్రబాబు, పవన్‌ శుభాకాంక్షలు

‘రాష్ట్రాలుగా వేరైనా తెలుగు ప్రజలు, తెలుగు జాతి ఒక్కటే. తెలుగువారు ఎక్కడున్నా సమున్నతంగా ఎదగాలన్నదే నా ఆలోచన’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర 11వ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎక్స్‌ వేదికగా ఆయన తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీపడుతూ వికసిత్‌ భారత్‌ -2047 నాటికి అగ్రస్థానానికి చేరుకోవాలి.’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘జనసేన పార్టీకి జన్మనిచ్చిన నేల, నాకు పునర్జన్మను ఇచ్చిన నేల, నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ దాశరథి కృష్ణమాచార్య కీర్తించిన నేల నా తెలంగాణ’ అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ప్రజలందరికీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

బేకరీలో దారుణం.. అందురూ చూస్తుండగానే..

చుండ్రు సమస్యకు సింపుల్ చిట్కాలు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 03 , 2025 | 03:48 AM