CM Revanth Reddy: క్యాన్సర్ బాధిత కుటుంబానికి అండగా సీఎం
ABN , Publish Date - May 15 , 2025 | 03:40 AM
క్యాన్సర్ బాధిత కుటుంబాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదుకున్నారు. తక్షణ చికిత్స కోసం లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్వోసీ) కింద రూ.5 లక్షలు అందించగా..

సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.12 లక్షలు అందజేత
నాలుగు రోజుల క్రితం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం
హైదరాబాద్, మే 14 (ఆంధ్రజ్యోతి): క్యాన్సర్ బాధిత కుటుంబాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదుకున్నారు. తక్షణ చికిత్స కోసం లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్వోసీ) కింద రూ.5 లక్షలు అందించగా.. చికిత్స అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) కింద మరో రూ.7 లక్షలను మంజూరు చేశారు. ఈ మేరకు బుధవారం సచివాలయంలో బాధితుడు సాయిచరణ్కు రూ.7 లక్షల చెక్కును అందించారు. సిద్ధిపేటకు చెందిన సాయిచరణ్ (35)కు జన్యు మార్పిడి కారణంగా కోటి మందిలో ఒకరికి వచ్చే అరుదైన అక్యుర్డ్ మైలాయిడ్ లుకేమియా (బ్లడ్ క్యాన్సర్) బారిన పడ్డారు. అతని చికిత్సకు కుటుంబ సభ్యులు సిద్దిపేట మండలం ఎన్సాన్పల్లిలోని తమ ఇంటిని విక్రయించారు.
అయినప్పటికీ చికిత్సకు అవసరమైనంత డబ్బులు సరిపోకపోవడంతో సమస్యను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. సీఎం తక్షణ సాయంగా మంజూరు చేసిన రూ.5 లక్షలతో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో సాయిచరణ్కు స్టెమ్సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ పూర్తయింది. తాజాగా చికిత్సకు అదనంగా వ్యయమైన మరో రూ.7 లక్షలను సీఎంఆర్ఎఫ్ ద్వారా సీఎం రేవంత్ చెక్కును సాయిచరణ్ కుటుంబ సభ్యులకు అందించారు. కాగా సాయిచరణ్ సమస్యను వివరిస్తూ ‘‘మా నాన్నను బతికించండి’’ శీర్షికన ఈ నెల 10న ‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని ప్రచురించింది.
ఈ వార్తలు కూడా చదవండి
jagtyaala : పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి..
Crime News: తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..
TG News: ఢీకొన్న రెండు కార్లు.. ఆ తర్వాత ఏమైందంటే..
Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య
Read Latest Telangana News And Telugu News