Revanth Reddy: అత్యాధునిక సౌకర్యాలతో గోశాలలు
ABN , Publish Date - Jun 01 , 2025 | 03:02 AM
రాష్ట్రంలో అత్యాధునిక సౌకర్యాలతో గోశాలలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. గోవులను స్థలాల్లో బంధించినట్లుగా కాకుండా...

ఒక్కొక్కటి 50 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు
ప్రణాళిక రూపకల్పనకు ప్రత్యేక కమిటీ
ధార్మిక సంస్థలను భాగస్వాములను చేసే అంశాన్నీ పరిశీలించాలి: సీఎం రేవంత్
హైదరాబాద్, మే 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అత్యాధునిక సౌకర్యాలతో గోశాలలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. గోవులను స్థలాల్లో బంధించినట్లుగా కాకుండా... మేత మేసేందుకు, స్వేచ్ఛగా తిరిగేందుకు వీలుగా గోశాలలు ఉండాలని సూచించారు. గోశాలల ఏర్పాటుకు సంబంధించి కమిటీని ఏర్పాటు చేయాలని, నిర్ణీత గడువులోగా కమిటీ పూర్తిస్థాయి ప్రణాళికతో రావాలని అన్నారు. రాష్ట్రంలో గోశాలల అభివృద్ధి, నిర్వహణ, సంరక్షణపై శనివారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోవుల సంరక్షణ, నిర్వహణ సులువుగా ఉండేందుకు వీలుగా గోశాలల ఏర్పాటు ఉండాలన్నారు. మొదటి దశలో రాష్ట్రంలోని వెటర్నరీ యూనివర్సిటీ, కాలేజీలు, వ్యవసాయ యూనివర్సిటీ, కాలేజీలు, దేవాలయాలకు సంబంధించిన భూముల్లో గోశాలలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఇందుకోసం అందుబాటులో ఉన్న స్థలాలను గుర్తించాలని, కనీసం 50 ఎకరాల విస్తీర్ణానికి తగ్గకుండా గోశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిర్వహణ, సంరక్షణలో ధార్మిక సంస్థలను భాగస్వాములను చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. గోశాలల నిర్మాణం, నిర్వహణ, సంరక్షణకు సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ అంచనాలతో ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎంకేపల్లిలో ఏర్పాటు చేయనున్న గోశాలకు సంబంధించి పలు డిజైన్లను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పరిశీలించారు. షెడ్ల నిర్మాణం, ఇతర డిజైన్లలో పలు మార్పులను సూచించారు. మరో నాలుగైదు రోజుల్లోగా తుది నమూనాను ప్రభుత్వం ఖరారు చేయనుంది.
మా కుమారుడి వివాహానికి రండి!
సీఎంకు నాగార్జున దంపతుల ఆహ్వానం
ఈ నెల 6వ తేదీన తమ కుమారుడు అఖిల్ వివాహానికి రావాలంటూ సీఎం రేవంత్రెడ్డిని సినీ నటుడు అక్కినేని నాగార్జున, అమల దంపతులు ఆహ్వానించారు. శనివారం సీఎం రేవంత్ను ఆయన నివాసంలో కలిసిన వారు.. వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఇవి కూడా చదవండి
జగన్ ప్రభుత్వంలో రేషన్ సరుకుల అక్రమాలపై విచారణ చేశాం
ఆపరేషన్ సిందూర్పై కామెంట్లు.. లా స్టూడెంట్ అరెస్ట్..