CM Revanth: వరంగల్కు సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు
ABN , Publish Date - Jul 20 , 2025 | 08:12 PM
వరంగల్కు సీఎం రేవంత్ వరాలు కురిపించారు. క్రికెట్ స్టేడియం, స్పోర్ట్స్ స్కూల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు..

హైదరాబాద్, జులై 20: వరంగల్కు సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. వరంగల్కు క్రికెట్ స్టేడియం, స్పోర్ట్స్ స్కూల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, రేపూరి ప్రకాష్ రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. వరంగల్ అభివృద్ధిపై ఎమ్మెల్యేలు అడిగిన స్పోర్ట్స్ స్కూల్, క్రికెట్ స్టేడియంను తక్షణమే మంజూరు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దీనిపై నేతలు తమ ఆనందాన్ని వెలిబుచ్చారు.
ఇవీ చదవండి:
లండన్లోని ఇస్కాన్ రెస్టారెంట్లో షాకింగ్ సీన్.. వీడియో వైరల్
22 ఏళ్ల వయసులో ఒంటరిగా విదేశీ యాత్ర.. ఈ భారతీయ యువకుడి అనుభవం ఏంటో తెలిస్తే..