Share News

Grain Procurement: ధాన్యం సేకరణ తర్వాత తనిఖీలు చేపట్టాలి

ABN , Publish Date - Aug 01 , 2025 | 04:57 AM

ప్రతి సీజన్‌ ముగిసిన వెంటనే ధాన్యం నిల్వలపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భౌతిక తనిఖీలు(ఫిజికల్‌ వెరిఫికేషన్‌) చేపట్టాలని

Grain Procurement: ధాన్యం సేకరణ తర్వాత తనిఖీలు చేపట్టాలి

  • ఎస్‌వోపీ జారీ చేసిన కేంద్ర ఆహార పంపిణీ శాఖ

ప్రతి సీజన్‌ ముగిసిన వెంటనే ధాన్యం నిల్వలపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భౌతిక తనిఖీలు(ఫిజికల్‌ వెరిఫికేషన్‌) చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు గురువారం స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌(ఎ్‌సవోపీ)ను కేంద్ర వినియోగదారులు, ఆహార పంపిణీ శాఖ జారీ చేసింది. ఏ సీజన్‌లో అయినా ధాన్యం సేకరణ ముగిసిన వెంటనే భౌతిక తనిఖీలు నిర్వహించాలని, 30 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఒకవేళ నిల్వలు గుట్టలుగా ఉంటే... వాటిని 3 రోజుల్లో క్రమబద్ధీకరించాలని, లేకపోతే వాటిని నిల్వలుగా పరిగణించబోమని స్పష్టం చేసింది. ధాన్యం మర ఆడించడానికి అదనపు గడువు పొడిగించాలని కోరే రాష్ట్రాలు... ముందుగా మిగిలిన నిల్వలపై కనీసం 10 శాతం మిల్లుల్లో సంయుక్త తనిఖీలు నిర్వహించాలని సూచించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ పర్యటన.. ప్రశాంతి రెడ్డి రియాక్షన్

జగన్ జైలుకు వెళ్తారా అంటే.. లోకేష్ ఏమన్నారంటే..

For More Telangana News And Telugu News

Updated Date - Aug 01 , 2025 | 04:57 AM