Share News

Bhashyam school: భాష్యం విద్యార్థుల ప్రభంజనం

ABN , Publish Date - May 01 , 2025 | 06:04 AM

ఎస్సార్ నగర్‌లోని భాష్యం పాఠశాల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో అద్భుత విజయం సాధించారు. 593 మార్కులతో బి.సూర్యరిషి టాపర్‌గా నిలవగా, 580 పైగా మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య 103.

 Bhashyam school: భాష్యం విద్యార్థుల ప్రభంజనం

అమీర్‌పేట, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి ఫలితాల్లో ఎస్‌ఆర్‌ నగర్‌లోని భాష్యం పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. పాఠశాలకు చెందిన బి.సూర్యరిషి అత్యధికంగా 593 మార్కులు సాధించగా, జె.ఆదిత్య 592, ఎస్‌.లాస్యశ్రీ 592, ఇ.రక్షిత్‌ 591, ఆర్‌. కిరణ్‌కుమార్‌ 591, పి. ఉత్కర్ష్‌రెడ్డి 591, వై, నమ్రతసాయి 590, పి.బాలు 590, కె.అభిఙ్ఞ 590 మార్కులు సాధించారు. 103 మందికి 580పైగా, 278 మందికి 570పైగా మార్కులు వచ్చాయి. ఈ సందర్భంగా భాష్యం పాఠశాల జడ్‌ఈవో శిరీష మాట్లాడుతూ విద్యార్థుల క్రమశిక్షణ, ఉపాధ్యాయుల కృషి ఫలితాంగానే అద్భుత విజయం సాధించగలిగామన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను భాష్యం విద్యా సంస్థల చైర్మన్‌ భాష్యం రామకృష్ణ, వైస్‌ చైర్మన్‌ భాష్యం హనుమంతరావు, మేనేజింగ్‌ డైరక్టర్‌ భాష్యం సాకేత్‌ రామ్‌ అభినందించారు.

Updated Date - May 01 , 2025 | 06:10 AM