Bandi Sanjay: డబుల్ ఇంజన్ సర్కారుతో ఏపీకి డబుల్ ధమాకా
ABN , Publish Date - Jun 12 , 2025 | 03:05 AM
డబుల్ ఇంజన్ సర్కార్తో ఆంధ్రప్రదేశ్కు డబుల్ ధమాకా లభించిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు.

ఆ రాష్ట్రానికి నిధుల వరద పారిస్తున్న మోదీ: సంజయ్
తిరుపతి(విద్య), జూన్ 11(ఆంధ్రజ్యోతి): డబుల్ ఇంజన్ సర్కార్తో ఆంధ్రప్రదేశ్కు డబుల్ ధమాకా లభించిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. కేంద్రంలో మోదీ పరిపాలన ప్రారంభమై 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర సంక్షేమ పథకాలను వివరిస్తూ తిరుపతిలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను బుధవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కేందం చేస్తు న్న సాయాన్ని లెక్కలతో సహా వివరించారు. ‘ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇదివరకు ఏ రాష్ట్రానికీ లేనంతగా కేంద్ర ప్రభుత్వం నిధుల వదర పారించింది. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఏపీని గట్టెక్కించేందుకు ప్రత్యేక ఆర్థిక సాయాన్ని మోదీ అందిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు కూడా డబుల్ ఇంజన్ పాలన కావాలని కోరుకుంటున్నారు’ అని అన్నారు.