Share News

Bandi Sanjay: బీజేపీతో పొత్తు ఉంటుందని ఏమార్చారు

ABN , Publish Date - Jun 01 , 2025 | 03:43 AM

గతంలో బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలోని చాలా మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లోకి వచ్చారని.. అలా జరిగిన ప్రతిసారీ కేసీఆర్‌ ఎమ్మెల్యేలతో సమావేశమై కమలంతో పొత్తు పెట్టుకుంటామని చెప్పి వారిని కాషాయ గూటికి రాకుండా చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఆరోపించారు.

Bandi Sanjay: బీజేపీతో పొత్తు ఉంటుందని ఏమార్చారు

  • బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లోకి..

  • వచ్చినప్పుడల్లా కేసీఆర్‌ ఇదే చెప్పారు: సంజయ్‌

కరీంనగర్‌, మే 31(ఆంధ్రజ్యోతి, ప్రతినిధి): గతంలో బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలోని చాలా మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లోకి వచ్చారని.. అలా జరిగిన ప్రతిసారీ కేసీఆర్‌ ఎమ్మెల్యేలతో సమావేశమై కమలంతో పొత్తు పెట్టుకుంటామని చెప్పి వారిని కాషాయ గూటికి రాకుండా చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ అంటేనే అవినీతి పార్టీ అని, కవితను అరెస్టు చేయకుండా ఉండటానికి బీజేపీతో కలవడానికి బీఆర్‌ఎస్‌ ప్రయత్నించిందని చెప్పారు. కుటుంబ పార్టీని తాము దగ్గరకు రానివ్వలేదని తెలిపారు. శనివారం కరీంనగర్‌లో సంజయ్‌ విలేకరులతో మాట్లాడారు. ఈటల రాజేందర్‌, హరీశ్‌రావు భేటీ విషయం తెలియదని, ఇదంతా కాంగ్రెస్‌ ఆడుతున్న డ్రామా అని తెలిపారు.


కవిత విషయంలోనూ అదే డ్రామా నడుస్తోందని చెప్పారు కల్వకుంట్ల ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ నిర్మాణ దర్శకత్వంలో కవిత పాత్రధారిగా చార్‌పత్తా సినిమా నడుస్తోందన్నారు. కవిత ఎపిసోడ్‌తో ప్రజలకు మేలు జరుగుతుందా..? అని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలపై చర్చ జరగకుండా చిట్‌చాట్‌ల పేరుతో ప్రజల దృష్టిని మళ్లించే కుట్ర జరుగుతోందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు ముమ్మాటికీ దేశ ద్రోహమే అని సంజయ్‌ అన్నారు. సైన్యం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా, పాకిస్తాన్‌ ఉగ్రవాదులను పెంచి పోషించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ అవినీతి, కాళేశ్వరం ప్రాజెక్టు, డ్రగ్స్‌, ఫోన్‌ ట్యాపింగ్‌, ఫాంహౌస్‌, ఫార్ములా-ఈ రేసు కేసుల విషయంలో అరెస్టులు ఉంటాయని చెప్పి కాంగ్రెస్‌ మాట తప్పిందని అన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కలిసి బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని చూస్తున్నాయని, వాళ్లెన్ని కుట్రలు చేసినా అది జరగదని చెప్పారు. వేములవాడ రాజన్న ఆలయ పరిధిలో 18 గోవులు చనిపోవడంపై అధికారులు వ్యవహరిస్తున్న తీరు సరికాదని సంజయ్‌ అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

jagtyaala : పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి..

Crime News: తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..

TG News: ఢీకొన్న రెండు కార్లు.. ఆ తర్వాత ఏమైందంటే..

Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 01 , 2025 | 03:43 AM