625 మంది పోలీసులకు పతకాలు
ABN , Publish Date - Jun 02 , 2025 | 06:01 AM
రాష్ట్ర అవతరణ దినోత్సవాల సందర్భంగా 625 మంది ప్రతిభావంతులైన పోలీసులకు సేవా పతకాలను ప్రభుత్వం ప్రకటించింది.

రాష్ట్ర అవతరణ దినోత్సవాల సందర్భంగా 625 మంది ప్రతిభావంతులైన పోలీసులకు సేవా పతకాలను ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 461 సేవా పతకాలు, 92 ఉత్తమ సేవా పతకాలు, 16 మహోన్నత సేవా పతకాలు, 47 కఠిన సేవా పతకాలు, 9 శౌర్య పతకాలు ఉన్నాయి. గ్రేహౌండ్స్ విభాగానికి చెందిన 9మందికి శౌర్య పతకాలు లభించాయి. 22 మంది అవినీతి నిరోధకశాఖ అధికారులకు, ఆరుగురు విజిలెన్స్ సిబ్బందికి పతకాలు ప్రకటించారు.
కోయభాషలో ఆహ్వాన పత్రికలు
భద్రాచలం, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని ప్రముఖులు, వివిధ శాఖల అధికారులను ఆహ్వానించేందుకు కోయభాషలో ఆహ్వాన పత్రాలను ముద్రించారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాలు, భాష అంతరించి పోకుండా, నేటి తరానికి అవగాహన కల్పించే లక్ష్యంతో కోయభాషను తెలుగులిపిలో ముద్రించామని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ చెప్పారు.
ఇవి కూడా చదవండి
తెలంగాణ లా, ప్రొస్ట్గ్రాడ్యుయేషన్ లా సెట్ అడ్మిట్ కార్డుల విడుదల..
మల విసర్జన చేయడానికి మంచి టైం ఏది.. డాక్టర్లు ఏం చెబుతున్నారు..