Share News

Adilabad: జొన్న పంట లేప తిని 20 ఆవులు మృతి

ABN , Publish Date - May 03 , 2025 | 04:23 AM

జొన్న లేప తిని 20 ఆవులు మృతి చెందగా.. మరో 20 ఆవులు ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఘటన ఆదిలాబాద్‌ జిల్లా బజార్‌హత్నూర్‌ మండలం బుర్కపల్లిలో చోటు చేసుకుంది.

Adilabad: జొన్న పంట లేప తిని 20 ఆవులు మృతి

బజార్‌ హత్నూర్‌, మే 2(ఆంధ్రజ్యోతి): జొన్న లేప తిని 20 ఆవులు మృతి చెందగా.. మరో 20 ఆవులు ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఘటన ఆదిలాబాద్‌ జిల్లా బజార్‌హత్నూర్‌ మండలం బుర్కపల్లిలో చోటు చేసుకుంది. గ్రామంలో కోసి వదిలేసిన జొన్న లేపను పశువులు తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యాయి. సమాచారం అందుకున్న పశు వైద్యాధికారులు గ్రామానికి చేరుకుని ఆవులకు చికిత్స అందించారు. రైతులు పంటను కోసి వదిలేయడం వల్ల వర్షాలు పడి చిగురించిన లేపను పశువులు తింటే వాటి ప్రాణానికే ప్రమాదమని పశువైద్యాధికారి పర్వేజ్‌ అహ్మద్‌ సూచించారు.

Updated Date - May 03 , 2025 | 04:23 AM