Share News

18 Naxals surrender: 18 మంది నక్సల్స్‌ లొంగుబాటు

ABN , Publish Date - May 28 , 2025 | 05:00 AM

సుకుమా జిల్లాలో 18 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో హిడ్మా నాయకత్వంలోని పీఎల్‌జీఏ బెటాలియన్‌కు చెందిన నలుగురు నక్సల్స్‌ ఉన్నారు.

18 Naxals surrender: 18 మంది నక్సల్స్‌ లొంగుబాటు

చర్ల, మే 27 (ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌గఢ్లోని సుకుమా జిల్లాలో 18 మంది మావోయిస్టులు మంగళవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో హిడ్మా నేతృత్వం వహించే పీఎల్‌జీఏ మొదటి బెటాలియన్‌కు చెందిన నలుగురు నక్సల్స్‌ ఉన్నట్లు సుకుమా ఎస్పీ కిరణ్‌ చవాన్‌ తెలిపారు. మిగతా వారిలో వివిధ దళాల సభ్యులు ఉన్నట్లు తెలిపారు. వీరందరిపై రూ.39 లక్షల రివార్డు ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు.. మావోయిస్టులు ఆయుధాలను వదిలి, పోలీసుల ఎదుట లొంగిపోవాలంటూ బస్తర్‌ రీజియన్‌ ఐజీ సుందర్‌రాజ్‌ ఓ ప్రకటనను విడుదల చేశారు.

Updated Date - May 28 , 2025 | 05:03 AM