Virat Kohli: 18 జెర్సీ కోహ్లీ.. 18 ఏళ్ల నిరీక్షణ ఈరోజు ఫలిస్తుందా..
ABN , Publish Date - Jun 03 , 2025 | 06:20 PM
విరాట్ కోహ్లీ (Virat Kohli) ఒక ఆటగాడు మాత్రమే కాదు, ఒక ఎమోషన్. 18 జెర్సీ కల్గిన విరాట్, 18 ఏళ్లుగా ఆర్సీబీ తరుఫున తొలి విజయం కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నో ఆశలు, ఎన్నో కన్నీళ్లు, ఎన్నో కలలు. కానీ ఈ మంగళవారం రాత్రి, ఆ కల నెరవేరే అవకాశం వచ్చింది. ప్రత్యర్థి జట్టు శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్తో ఆర్సీబీ ఐపీఎల్ పోరు కొనసాగించనుంది.

ఐపీఎల్ 2025 ఫైనల్ (IPL Final 2025) మ్యాచ్ సమయం రానే వచ్చింది. ఈరోజు (జూన్ 3, 2025న) రాత్రి 7.30 గంటలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), పంజాబ్ కింగ్స్ (PBKS) జట్ల మధ్య రసవత్తర పోరు అహ్మదాబాద్ వేదికగా మొదలు కానుంది. దీని కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో 18 జెర్సీ కల్గి ఉన్న విరాట్ కోహ్లీ (Virat Kohli) 18 సంవత్సరాలుగా ఆర్సీబీ మొదటి విజయం కోసం ఎదురుచూస్తుండటం విశేషం.
ఒక ఆటగాడు మాత్రమే కాదు..
విరాట్ కోహ్లీ ఆర్సీబీ జెర్సీలో 18వ సీజన్లో ఆడుతూ, తన జట్టును విజయం వైపు నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీ పంజాబ్ కింగ్స్ జట్టుతో ఆడనుంది. 2008 నుంచి ఆర్సీబీ తరపున ఆడుతున్న విరాట్ కోహ్లీ ఈ జట్టుకు కేవలం కెప్టెన్ లేదా ఆటగాడు మాత్రమే కాదు. ఆర్సీబీ అభిమానుల హార్ట్ బీట్, ఒక ఎమోషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 18 సీజన్లలో 600+ పరుగులు ఐదుసార్లు సాధించిన ఏకైక బ్యాట్స్మన్గా కోహ్లీ రికార్డు సృష్టించాడు.
ఫైనల్ చేరడంలో...
ఈ సీజన్లోనూ విరాట్ 600+ పరుగులతో జట్టును ముందుండి నడిపించాడు. అతని అద్భుతమైన ఫామ్, అదిరిపోయే బ్యాటింగ్ జట్టును ఫైనల్కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాయి. కోహ్లీ ఎట్టకేలకు 18 సంవత్సరాల నమ్మకం, అంకితభావం ఈ రోజు ఫలించే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఐపీఎల్ టైటిల్ కోసం ఎదురుచూస్తున్న నిరీక్షణ ఈరోజు తీరుతుందా? మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి మరి.
ఆర్సీబీ vs పీబీకేఎస్ హెడ్ టూ హెడ్
ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ మధ్య ఇప్పటివరకు 36 మ్యాచ్లు జరిగాయి. ఇందులో రెండు జట్లూ 18 మ్యాచ్ల చొప్పున గెలిచాయి. ఈ సమానమైన రికార్డు ఈ ఫైనల్ మ్యాచ్ను మరింత ఆసక్తికరంగా చేస్తోంది. ఈ సీజన్లో ఆర్సీబీ బ్యాటింగ్లో కోహ్లీ, రజత్ పాటిదార్ మెరుగైన ప్రదర్శన చేశారు. బౌలింగ్లో కృనాల్ పాండ్యా, యష్ దయాల్ వంటి ఆటగాళ్లు కీలక పాత్ర పోషించారు.
మూడు సార్లు ఫైనల్
మరోవైపు పంజాబ్ కింగ్స్ జట్టులో శ్రేయాస్, అర్ష్దీప్ సింగ్, చాహల్ వంటి ఆటగాళ్లు ఈ సీజన్లో రాణించారు. ఈ రెండు జట్ల బలబలాలు ఈ మ్యాచ్ను మరింత రసవత్తరంగా మార్చాయి. గతంలో ఆర్సీబీ 2009, 2011, 2016 మూడు సార్లు ఫైనల్కి చేరినా, టైటిల్ మాత్రం అందలేదు. కానీ ఈ సీజన్ మాత్రం మరోలా ఉంది. ఈ లీగ్ దశలోనే దూకుడుగా ఆడి, క్వాలిఫయర్ 1లో పంజాబ్పై ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన బెంగళూరు. ఇప్పుడు పూర్తి స్థాయి కుదురుకున్న జట్టుగా కనిపిస్తోంది.
ఇవీ చదవండి:
గుకేష్ ఎమోషనల్.. వీడియో చూడాల్సిందే!
బీసీసీఐ బాస్గా మాజీ జర్నలిస్ట్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి