Triangular Womens Series: శ్రీలంక విజయం
ABN , Publish Date - May 03 , 2025 | 04:08 AM
మహిళల ముక్కోణపు టోర్నీలో శ్రీలంక మహిళల జట్టు దక్షిణాఫ్రికాను 5 వికెట్ల తేడాతో ఓడించింది. ఛేదనలో హర్షిత, కవిష అర్ధసెంచరీలతో రాణించారు.

కొలంబో: మహిళల ముక్కోణపు టోర్నీలో ఆతిథ్య శ్రీలంకకు తొలి విజయం దక్కింది. శుక్రవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో లంక 5 వికెట్ల తేడాతో నెగ్గింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 9 వికెట్లకు 235 పరుగులు చేసింది. డెరెక్సెన్ (61), లారా గూడాల్ (46) రాణించారు. మల్కి మడారాకు నాలుగు, విహంగకు మూడు వికెట్లు దక్కాయి. ఛేదనలో లంక జట్టు 46.3 ఓవర్లలో 237/5 స్కోరుతో నెగ్గింది. హర్షిత (77), కవిష (61) అర్ధసెంచరీలు సాధించారు.