Badminton: నెంబర్వన్ను చిత్తుచేసి..సెమీస్కు సాత్విక్ జోడీ
ABN , Publish Date - May 31 , 2025 | 03:27 AM
సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్లో సాత్విక్ సాయిరాజ్/చిరాగ్ శెట్టి జోడీ వరల్డ్ నెంబర్వన్ జోడీని 21-17, 21-15తో చిత్తు చేసి సెమీఫైనల్కు చేరింది. ఈ సీజన్లో తొలి టైటిల్ దిశగా ఆ జోడీ ముందడుగు వేసింది.

సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్
సింగపూర్: డబుల్స్ టాప్ జోడీ సాత్విక్ సాయిరాజ్/చిరాగ్ శెట్టి ఈ సీజన్లో తొలి టైటిల్ దిశగా ముందడుగు వేసింది. సింగపూర్ ఓపెన్లో ప్రపంచ నెంబర్వన్ ర్యాంక్ జోడీని చిత్తుచేసి సెమీఫైనల్కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో 27వ ర్యాంకరైన భారత ద్వయం 21-17, 21-15తో గో జీ ఫీ/నూర్ ఇజుద్దీన్ (మలేసియా)పై గెలుపొందింది. భారత జంట సెమీస్లో మలేసియాకే చెందిన మూడోసీడ్ ఆరోన్ చియా/సో వూయి యిక్తో అమీతుమీ తేల్చుకోనుంది.