Share News

Minor Abuse: మైనర్‌పై అత్యాచారం

ABN , Publish Date - Jul 26 , 2025 | 02:00 AM

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఆర్‌సీబీ పేసర్‌ యశ్‌ దయాళ్‌పై మరో అత్యాచారం కేసు నమోదైంది.

Minor Abuse: మైనర్‌పై అత్యాచారం

  • పేసర్‌ యశ్‌ దయాళ్‌పై ఎఫ్‌ఐఆర్‌

జైపూర్‌: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) పేసర్‌ యశ్‌ దయాళ్‌పై మరో అత్యాచారం కేసు నమోదైంది. ఈమేరకు జైపూర్‌ పోలీసులు అతడిపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారు. పోలీసులు అందించిన వివరాల మేరకు..యశ్‌ దయాళ్‌ తొలిసారి 2023లో 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. క్రికెటర్‌గా ఎదిగేందుకు సాయం చేస్తాననే సాకుతో దయాళ్‌ పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడట. ఈమేరకు బాలిక చేసిన ఫిర్యాదుతో భారత న్యాయ సంహితలోని సెక్షన్‌ 64తోపాటు, పోక్సో చట్టం కింద 27 ఏళ్ల యశ్‌ దయాళ్‌పై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. కాగా దయాళ్‌పై అత్యాచారం కేసు నమోదు కావడం ఇది రెండోసారి. యూపీకి చెందిన ఓ మహిళను పెళ్లి చేసుకుంటానని ఐదేళ్లపాటు ఆమెతో సహజీవనం చేసి మోసం చేసిన కేసులో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.


ఇవి కూడా చదవండి

వాయుగుండం.. మళ్లీ భారీ వర్షాలు

పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..

For More Andhrapradesh News And Telugu News

Updated Date - Jul 26 , 2025 | 02:00 AM