India A vs England Lions Test: కరుణ్ డబుల్ సెంచరీ
ABN , Publish Date - Jun 01 , 2025 | 02:02 AM
కరుణ్ నాయర్ డబుల్ సెంచరీతో భారత ‘ఎ’ జట్టును 557 పరుగుల వద్ద నిలిపాడు. ఇంగ్లండ్ లయన్స్ తొలి ఇన్నింగ్స్లో 237 పరుగుల వద్ద 2 వికెట్లు కోల్పోయింది.

భారత్ ‘ఎ’ 557
కాంటర్బరీ: కరుణ్ నాయర్ (204) తన సూపర్ ఫామ్ను డబుల్ సెంచరీతో చాటుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ లయన్స్తో జరుగుతున్న తొలి అనధికార టెస్టులో భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్లో 557 పరుగులకు ఆలౌటైంది. అయితే ధ్రువ్ జురెల్ (94) తృటిలో శతకం కోల్పోయాడు. హర్ష్ దూబే (32), శార్దూల్ (27) ఫర్వాలేదనిపించారు. ఆ తర్వాత బరిలోకి దిగిన ఇంగ్లండ్ లయన్స్ రెండో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 52 ఓవర్లలో 2 వికెట్లకు 237 పరుగులు చేసింది. ఓపెనర్ టామ్ హైనె స్ (103 బ్యాటింగ్) సెంచరీ, మాక్స్ హోల్డెన్ (64 బ్యాటింగ్) హాఫ్ సెంచరీ సాధించారు.