IPL 2025: ప్లేఆఫ్ సినారియోను మార్చేసిన హైదరాబాద్ జట్టు..కానీ చివరకు..
ABN , Publish Date - May 20 , 2025 | 07:29 AM
ఐపీఎల్ 2025 (IPL 2025) సీజన్ చివరి దశకు వచ్చేసింది. ఈ సీజన్ మొదట్లో ఉన్న ఉత్కంఠ, ఇప్పుడు మళ్లీ వచ్చేసింది. సోమవారం లక్నో సూపర్ జాయింట్స్, సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది. దీంతో లక్నో జట్టు ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. ఈ క్రమంలో ప్లేఆఫ్ సినారియో పూర్తిగా మారిపోయింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) సీజన్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆదివారం నాటి మ్యాచ్ల తర్వాత గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు ప్లేఆఫ్స్కు అర్హత సాధించాయి. కానీ సోమవారం జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జయింట్స్ సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోవడంతో, ఆ జట్టు ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకుంది. దీంతో చివరి ప్లేఆఫ్ స్థానం కోసం మూడు జట్లకు బదులు రెండు జట్లు మాత్రమే పోటీ పడతాయి. వీటిలో ముంబై ఇండియన్స్ (MI), దిల్లీ క్యాపిటల్స్ (DC) తలపడనున్నాయి.
ప్రస్తుతం ఈ జట్ల పరిస్థితి ఎలా ఉంది..
ముంబై ఇండియన్స్ జట్టు 12 మ్యాచ్లలో 7 విజయాలతో 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది, వీరి నెట్ రన్ రేట్ (ఎన్ఆర్ఆర్) +1.156గా కలదు. మరోవైపు, దిల్లీ క్యాపిటల్స్ 12 మ్యాచ్లలో 13 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. కానీ వారి నెట్ రన్ రేట్ +0.260, ముంబై జట్టుతో పోలిస్తే బలహీనంగా ఉందని చెప్పవచ్చు. ఈ రెండు జట్ల మధ్య మే 21న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్ చివరి ప్లేఆఫ్ స్థానాన్ని నిర్ణయించే కీలకమైన పోరుగా నిలుస్తుంది.
ముంబై ఇండియన్స్ అర్హత అవకాశాలు..
ముంబై ఇండియన్స్ ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్గా నిలిచిన బలమైన జట్టు. వీరు ఈ సీజన్లో ఆరు మ్యాచ్ల వరుస విజయాలతో పునరాగమనం చేశారు. దీనిలో దిల్లీ క్యాపిటల్స్పై 12 రన్స్ తేడాతో గెలిచిన మ్యాచ్ కూడా ఉంది. ముంబైకి ఇప్పుడు రెండు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఒకటి దిల్లీ క్యాపిటల్స్తో, మరొకటి పంజాబ్ కింగ్స్తో జైపూర్లో జరగనుంది. ముంబై రెండు మ్యాచ్లలోనూ గెలిస్తే, వారు 18 పాయింట్లతో ప్లేఆఫ్స్కు పక్కాగా అర్హత సాధిస్తారు. ముంబై దిల్లీతో ఓడిపోయి, పంజాబ్తో గెలిస్తే, వారు 16 పాయింట్లతో ఉంటారు. అయితే, దిల్లీ తమ చివరి మ్యాచ్లో పంజాబ్ను ఓడిస్తే, రెండు జట్లూ 16 పాయింట్లతో సమానంగా ఉంటాయి. ఈ సందర్భంలో కూడా ముంబై మంచి నెట్ రన్ రేట్ (+1.156) వారికి అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు.
దిల్లీ క్యాపిటల్స్ అర్హత ఎలా ఉందంటే
అక్షర్ పటేల్ నాయకత్వంలోని దిల్లీ క్యాపిటల్స్ సీజన్ను బలంగా ప్రారంభించింది. కానీ మధ్యలో వరుస ఓటములతో వెనుకబడింది. గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఇటీవలి మ్యాచ్లో 10 వికెట్ల తేడాతో ఓడిపోవడంతో వారి నెట్ రన్ రేట్ కూడా దెబ్బతింది. దిల్లీకి రెండు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్తో జైపూర్లో. దిల్లీ రెండు మ్యాచ్లలోనూ గెలిస్తే, వారు 17 పాయింట్లతో ప్లేఆఫ్స్కు అర్హత సాధిస్తారు. మే 21న ముంబైని ఓడించి, పంజాబ్తో ఓడిపోతే, దిల్లీ 15 పాయింట్లతో ఉంటుంది. ఈ సందర్భంలో, ముంబై తమ చివరి మ్యాచ్లో పంజాబ్ను ఓడించకపోతే, దిల్లీకి అవకాశం ఉంటుంది. కానీ నెట్ రన్ రేట్ కీలకం అవుతుంది.
ఇవీ చదవండి:
Loan Apps: యాప్ ద్వారా లోన్ తీసుకుంటున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి..
SBI: ఎఫ్డీ ఆశలకు బ్రేక్.. రెండోసారి కోత పెట్టిన ఎస్బీఐ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి