England and Wales Cricket Board: ట్రాన్స్జెండర్లకు చోటు లేదు
ABN , Publish Date - May 03 , 2025 | 04:27 AM
ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు మహిళల క్రికెట్లో ట్రాన్స్జెండర్లకు చోటు లేదని ప్రకటించింది. యూకే సుప్రీం కోర్టు తీర్పు అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది.

ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నిర్ణయం
లండన్: మహిళలు, బాలికల క్రికెట్ నుంచి ట్రాన్స్జెండర్లను పూర్తిగా నిషేధించనున్నట్టు..ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) శుక్రవారం వెల్లడించింది. గత నెలలో యూకే సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. కాగా..మహిళల ఫుట్బాల్లో ట్రాన్స్జెండర్లు ఆడడాన్ని నిషేధిస్తూ ఇంగ్లండ్, స్కాట్లాండ్ ఫుట్బాల్ సంఘం నిర్ణయం తీసుకున్న 24 గంటలలోనే ఈసీబీ కూడా అదే బాటలో పయనించడం గమనార్హం.