Share News

DC vs RR: ఢిల్లీని కట్టడి చేసిన రాజస్థాన్ రాయల్స్.. స్కోర్ ఎంతో తెలుసా

ABN , Publish Date - Apr 16 , 2025 | 09:05 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో ఈరోజు 32వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్ ఢిల్లీ హోం గ్రౌండ్ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచి రాజస్థాన్ జట్టు బౌలింగ్ ఎంచుకోగా, ఆటకు దిగిన ఢిల్లీ మ్యాచ్ ఏ మేరకు స్కోర్ చేసిందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

DC vs RR: ఢిల్లీని కట్టడి చేసిన రాజస్థాన్ రాయల్స్.. స్కోర్ ఎంతో తెలుసా
ipl 2025 DC vs RR

2025 ఐపీఎల్ (IPL 2025) 32వ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజు సామ్సన్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మ్యాచ్ కూడా రెండు జట్లకు చాలా కీలకం అని చెప్పవచ్చు. దీనిలో రాజస్థాన్ గెలిస్తే ప్లేఆఫ్స్‌కు చేరుకోవడానికి రేసులో ఉండేందుకు ఛాన్సుంది.

మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్ కూడా గెలిచి పాయింట్ల పట్టికలో నంబర్ 1 స్థానాన్ని తిరిగి పొందాలని కోరుకుంటుంది. ఢిల్లీ ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడింది. అందులో 4 గెలిచింది. రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడుకుంటే, వారు ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడి వాటిలో 2 మాత్రమే గెలవగలిగింది. ఈ క్రమంలో ఆటకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 20 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ ఐదు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.


టార్గెట్ ఏంతంటే..

ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రాజస్థాన్ రాయల్స్‌కు 189 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఢిల్లీ తరఫున ఏ బ్యాట్స్‌మెన్ కూడా పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయినప్పటికీ, పోరెల్ అత్యధికంగా 49 పరుగులు చేయగా, కేఎల్ రాహుల్ 38 పరుగులు మాత్రమే చేశారు. ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్‌ను అవుట్ చేయడం ద్వారా రాజస్థాన్ ఐదో వికెట్ పడగొట్టింది. అక్షర్ దూకుడుగా బ్యాటింగ్ చేసి 14 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 34 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీనికి ముందు అభిషేక్ పోరెల్‌ అవుట్ కావడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ నాల్గో వికెట్ కోల్పోయింది. పోరెల్ అర్ధ సెంచరీని ఒక పరుగు తేడాతో కోల్పోయాడు. పోరెల్ 37 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్ తో 49 పరుగులు చేసి ఔటయ్యాడు.


రాజస్థాన్ తరఫున..

కేఎల్ రాహుల్‌ను అవుట్ చేయడం ద్వారా జోఫ్రా ఆర్చర్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు మూడో దెబ్బ ఇచ్చాడు. రాహుల్, అభిషేక్ పోరెల్ మధ్య మూడో వికెట్‌కు 63 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. రాహుల్ 32 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 38 పరుగులు చేశాడు. ఈ క్రమంలో పవర్‌ప్లే ముగిసే సమయానికి ఢిల్లీ క్యాపిటల్స్ 40 పరుగుల మార్కును దాటింది. ఆ క్రమంలో ఆరు ఓవర్లు ముగిసే సమయానికి ఢిల్లీ రెండు వికెట్లకు 46 పరుగులు మాత్రమే చేసింది. గత మ్యాచ్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన కరుణ్ నాయర్ ఖాతా తెరవకుండానే రనౌట్ అయ్యాడు. దీంతో ఢిల్లీ 34 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. రాజస్థాన్ తరఫున బౌలింగ్ చేసిన జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు పడగొట్టాడు.


ఇవి కూడా చదవండి:

WhatsApp Security: మీ వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయిందా..ఇలా ఈజీగా మళ్లీ యాక్సెస్‌ పొందండి..


Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..


Bill Gates: వారానికి మూడు రోజేలే పని..బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..


iPhone like Design: రూ.6 వేలకే ఐఫోన్ లాంటి స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్లు తెలిస్తే షాక్ అవుతారు..

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 18 , 2025 | 01:38 PM