Share News

BCCI Tribute Terror Victims: ఉగ్ర చర్యలను ఖండించిన బీసీసీఐ

ABN , Publish Date - Apr 24 , 2025 | 04:28 AM

పహల్గాంలో ముష్కరుల దాడిలో మృతుల కోసం ముంబై, హైదరాబాద్‌ జట్లు నల్ల బ్యాండ్‌లు ధరించి మౌనప్రార్ధన చేశారు. బీసీసీఐ తీవ్రవాద చర్యలను ఖండిస్తూ బాణసంచా, చీర్‌లీడర్ల ప్రదర్శనను రద్దు చేసింది

 BCCI Tribute Terror Victims: ఉగ్ర చర్యలను ఖండించిన బీసీసీఐ

హల్గాంలో ముష్కరుల దాడిలో మరణించిన మృతులకు సంతాపంగా ముంబై, హైదరాబాద్‌ జట్లు నల్ల ఆర్మ్‌ బ్యాండ్‌లు ధరించి బరిలోకి దిగాయి. మ్యాచ్‌ ఆరంభానికి ముందు ఇరుజట్లూ మృతుల ఆత్మకు శాంతి కలగాలని నిమిషంపాటు మౌనం పాటించాయి. తీవ్ర విషాదం నెలకొన్న నేపథ్యంలో చీర్‌ లీడర్స్‌ డ్యాన్సులతోపాటు బాణసంచా కాల్చడాన్ని కూడా రద్దు చేసినట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. తీవ్రవాదుల పిరికిపంద చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా ప్రకటించాడు. మరణించిన వారి కుటుంబాలకు బోర్డు తరఫున శ్రద్ధాంజలి ఘటించాడు.

Updated Date - Apr 24 , 2025 | 04:30 AM