Genelia D Souza: డ్రైవర్ తొందరపాటు.. జెనీలియాకు తప్పిన పెను ప్రమాదం
ABN , Publish Date - May 23 , 2025 | 06:08 PM
Genelia D Souza: జెనీలియా ఆ ఇద్దరు కొడుకులతో అప్పుడప్పుడు సరదాగా బయట తిరుగుతూ ఉంటుంది. తాజాగా, జెనీలియా తన కుమారులతో కలిసి బయటకు వెళ్లారు. మళ్లీ ఇంటికి తిరిగి వెళ్లడానికి కారు ఎక్కుతుండగా పెను ప్రమాదం తప్పింది.

జెనీలియా డిసౌజా.. ఈ పేరుతో తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఈ ముంబై అమ్మాయి తెలుగులో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేసింది. హీరోయిన్గా టాప్లో ఉన్నపుడే బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ముఖ్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సినిమాలకు దూరం అయింది. హీరోయిన్గా సినిమాలు చేయలేదు కానీ, చాలా సినిమాల్లో కేమియో అప్పియరెన్స్ మాత్రమే ఇచ్చింది. 2020లో వచ్చిన ఇట్స్ మై లైఫ్ అనే హిందీ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టింది. 2022లో మజిలీ సినిమా రీమేక్ ‘ వేద్’లో నటించింది.
ఈ సినిమాకు స్వయంగా రితేష్ దేశ్ముఖ్ దర్శకత్వం వహించారు. ఇదే ఆయన మొదటి డైరెక్టోరియల్ డెబ్యూట్. ఇక, జెనీలియా ఓ వైపు సినిమాల్లో నటిస్తూ.. ప్రొడక్షన్ పనులు చూస్తూనే.. మరో వైపు కుటుంబాన్ని కూడా నడిపిస్తోంది. రితేష్, జెనీలియా జంటకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. జెనీలియా ఆ ఇద్దరు కొడుకులతో అప్పుడప్పుడు సరదాగా బయట తిరుగుతూ ఉంటుంది. తాజాగా, జెనీలియా తన కుమారులతో కలిసి బయటకు వెళ్లారు.
మళ్లీ ఇంటికి తిరిగి వెళ్లడానికి కారు ఎక్కుతుండగా పెను ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోలో ఏముందంటే.. జెనీలియా ఇద్దరు కొడుకులు కారులో కూర్చుని ఉన్నారు. జెనీలియా కారు ఎక్కడానికి ప్రయత్నించింది. ఆమె పూర్తిగా కూర్చోకముందే డ్రైవర్ కారును ముందుకు పోనిచ్చాడు. కారు గనుక కొంచెం వేగంగా వెళ్లి ఉంటే.. పెను ప్రమాదం జరిగి ఉండేది. జెనీలియా కారు కిందపడే అవకాశం ఉండేది. ఆ వీడియో చూస్తున్న నెటిజన్లు ‘ జాగ్రత్తగా ఉండండి మేడమ్’ అని అంటున్నారు.
ఇవి కూడా చదవండి
Viral Video: ఇండియన్ ఆక్వామ్యాన్.. ఉప్పొంగుతున్న మ్యాన్ హోల్లోంచి..
Metro Rail: మెట్రో రైల్ ప్రయాణికులకు శుభవార్త.. భారీగా తగ్గిన ఛార్జీలు..