Viral Video: ఇదేందయ్యా ఇది.. జలపాతాన్ని తలపిస్తున్న మెట్రో స్టేషన్..
ABN , Publish Date - May 26 , 2025 | 04:05 PM
Mumbai Worli Metro Station: మెట్రో స్టేషన్ పైకప్పులకు చిల్లులు పడ్డట్టు వర్షపు నీరు భారీగా కిందకు కారుతోంది. స్టేషన్ మొత్తం నీటితో నిండిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.

దేశ వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. సౌత్తో పోల్చితే నార్త్లో వర్షాలు అధికంగా పడుతున్నాయి. మహారాష్ట్రలోని ముంబై నగరంలో నిన్న రాత్రి మొదలైన వర్షం.. ఈ రోజు ఉదయం వరకు పడుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే వోర్లీ అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ జలపాతంలా మారిపోయింది. మెట్రో స్టేషన్ మొత్తం నీటితో తడిసి ముద్దగా అయింది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ నుంచి ఆచార్య ఆత్రే చౌక్ వరకు ఉన్న మెట్రో లైన్ 3 మే 10వ తేదీన ప్రారంభం అయింది. దీనికి ఆక్వా లైన్ అని పేరు కూడా పెట్టారు. కొత్తగా ప్రారంభం అయిన ఈ మెట్రో స్టేషన్ మొత్తం వర్షం కారణంగా దారుణంగా లీక్ అవుతోంది.
స్టేషన్ పైకప్పులకు చిల్లులు పడ్డట్టు వర్షపు నీరు భారీగా కిందకు కారుతోంది. స్టేషన్ మొత్తం నీటితో నిండిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వైరల్గా మారిన వీడియోలపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ ప్రారంభం అయి నెల కూడా కాలేదు. అంతలోనే లీకేజీ సమస్య వచ్చేసింది. బాగా అవినీతి జరిగినట్లు ఉంది’..‘ జలపాతం చూడ్డానికి కొండకోనల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. వోర్లీ మెట్రో స్టేషన్కు వస్తే సరిపోతుంది. సరదాగా గడిపేయవచ్చు’ అని కామెంట్లు చేస్తున్నారు.
వర్షాల కారణంగా మృత్యు ఘోష
ఉత్తర భారత దేశంలో భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. చెట్లు నేలకొరుగుతున్నాయి. ఇళ్ల గోడలు, పైకప్పులు కూలిపోతున్నాయి. దీని కారణంగా జనాలు మృత్యువాతపడుతున్నారు. ఒక్క ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోనే వర్షాల కారణంగా చెట్లు విరిగి మీద పడటం, ఇళ్ల పైకప్పులు, గోడలు కూలటం.. పిడుగులు పడటం వల్ల మే నెలలో ఏకంగా 49 మంది చనిపోయారు. ఉత్తర ప్రదేశ్లోని ఘజియాబాద్.. అంకుర్ విహార్ పోలీస్ స్టేషన్ పైకప్పు కుప్పకూలటంతో వీరేంద్ర కుమార్ మిశ్రా అనే పోలీస్ అధికారి చనిపోయాడు.
ఇవి కూడా చదవండి
ఫైనల్ డెస్టినేషన్ మూమెంట్.. మహిళపై కూలిపడ్డ సినిమా హాలు పైకప్పు..
కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఈ పనులు చేయండి..