Actor Vikrant Massey: ఆ పైలట్ విక్రాంత్ బంధువంటూ ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన హీరో
ABN , Publish Date - Jun 14 , 2025 | 08:20 AM
Actor Vikrant Massey: మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై విక్రాంత్ మస్సె క్లారిటీ ఇచ్చారు. నిన్న తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు.

అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో కో పైలట్ క్లివ్ కుందర్ చనిపోయిన సంగతి తెలిసిందే. క్లివ్ మృతిపై ప్రముఖ బాలీవుడ్ హీరో విక్రాంత్ మస్సె స్పందించారు. ఈ మేరకు మొన్న తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ‘విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను తల్చుకుంటే నా గుండె తరుక్కుపోతోంది. మా అంకుల్ క్లిఫర్డ్ కుమారుడు క్లివ్ కుందర్ చనిపోయాడని తెలిసి ఇంకా బాధగా ఉంది’ అని పేర్కొన్నాడు.
ఇక, ఈ పోస్టు సోషల్ మీడియాలో, మీడియాలో వైరల్ అయిపోయింది. విమాన ప్రమాదంలో చనిపోయిన పైలట్ క్లివ్ కుందర్ విక్రాంత్ మామ కొడుకు అంటూ ప్రచారం మొదలైంది. మీడియా సైతం దీనిపై వార్తలు రాసింది. ఈ నేపథ్యంలోనే మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై విక్రాంత్ మస్సె క్లారిటీ ఇచ్చారు. నిన్న తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘మీడియా మిత్రులకు, మిగిలిన వారికి విమాన ప్రమాదంలో చనిపోయిన క్లివ్ కుందర్ నా కజిన్ కాదు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాత్రమే. తప్పుడు వార్తలు ప్రచారం చేయకండి. వారి కుటుంబాన్ని ప్రశాంతంగా ఉండనివ్వండి’అని పేర్కొన్నాడు.
క్లివ్ చాలా తెలివైన వాడు..
విమాన ప్రమాదంలో చనిపోయిన క్లివ్ కుందర్ గురించి అతడికి చదువు చెప్పిన ప్రొఫెసర్ ఊర్వశి మాట్లాడుతూ.. ‘క్లివ్ చాలా తెలివైన స్టూడెంట్. చాలా డిసిప్లేన్గా ఉండేవాడు. డిసిప్లేన్ వల్లే అతడు సక్సెస్ఫుల్ పైలట్ అయ్యాడు. ఏదైనా ప్రత్యేకంగా చేయాలని నాతో చెబుతూ ఉండేవాడు. పైలట్ అయ్యాడు. ప్రమాదంలో నా విద్యార్థి క్లివ్ చనిపోయాడని తెలిసి చాలా బాధేసింది’ అని అంది.
ఇవి కూడా చదవండి
15 ఏళ్ల తర్వాత కలిశారు.. విమానం విషాదం మిగిల్చింది..
లక్ష దాటిన బంగారం ధర.. ఈ రోజు ఎంతంటే..